ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముక్యమంత్రి వైఎస్ జగన్ ని, వైసీపీ పార్టీ నాయకులను విమర్శచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు. 


ఇప్పుడు విమర్శించడం అపి అతను చేసిన పనులన ప్రజలకు తెలియచెయ్యటానికి ట్విట్టర్ ని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయింత్రం ట్విట్ చేస్తూ 'ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని, రాజకీయాలలో తప్ప మాకు వ్యక్తిగతంగా ఎలాంటి విరోధాలు లేవు' అని అసెంబ్లీలో ఉన్న వీడియోని పోస్ట్ చేశారు. 


ఈ నేపథ్యంలోనే మరొకసారి ప్రజల ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 'ప్రజలకోసం ఎన్ని అవమానాలెదురైనా భరిస్తా' అని, ఇల్లు కూల్చేస్తే రోడ్లపై పడుకొని అయినా ప్రజల కష్టాలు తీరుస్తా' అని వ్యాఖ్యానించిన వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ ట్విట్ కు స్పందిస్తున్న నెటిజన్లు 'మీరు నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు చంద్రబాబు గారు' అంటూ ట్విట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: