'రోహిణీ సింధూరి' ఓ మ‌హిళా ఐఏయ‌స్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచ‌ల‌నం. క‌ర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రుల‌కే చెమ‌ట‌లు ప‌ట్టించారు. ప్ర‌భుత్వం మీదే న్యాయ పోరాటం చేసారు.

చ‌ట్టానికి చుట్టాలుండ‌ర‌ని న‌మ్మట‌మే కాదు..ఆచ‌ర‌ణలో చూపించిన అధికారి. అటువంటి అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యించారు.ఈ మేర‌కు క‌ర్నాట‌క‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. వాళ్లు అంగీక‌రించారు.

మ‌రో నాలుగైదు రోజుల్లో నే ఈ డైన‌మిక్ అధికారి ఏపీ ముఖ్య‌మంత్రి టీంలో అధికారిగా చేర‌బోతున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే ఈ అధికారికి ముఖ్య‌మంత్రి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్న "స‌్పంద‌న" ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: