ఈ రోజు జరిగే తెలంగాణ శాసన సభ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ పురపాలక చట్టం 2019 పై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణా సిఎం మాట్లాడుతూ..ఈ చట్టం ఆవశ్యకత,ముఖ్యాంశాలు, లక్ష్యాలు ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.అవినీతి రహిత పాలన కోసం నూతన పురపాలక చట్టం తెస్తున్నామని చెప్పారు.

తెలంగాణ పురపాలక చట్టం 2019 ద్వారా పారదర్శకత వస్తుందన్నారు.పంచాయితీ అనేది ఒక విభాగం కాదని, ఓ ఉద్యమని ఆయన అన్నారు. ఈ చట్టాన్ని అనుసరించి 75 గజాల లోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ర్టేషన్ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని, జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ కలలు కన్నారని గుర్తు చేస్తూ, పంచవర్ష ప్రణాళికలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలనే చెప్పారు.

ఎమ్మెల్యేలందరికీ శిక్షణ ద్వారా పంచవర్ష ప్రణాళికలపై అవగాహన కల్పిస్తామన్నారు. భారత ప్రజాస్వామ్యం విస్తృతమైనదని మనది చాలా బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న దేశమని గుర్తు చేశారు. అవినీతి రహిత మున్సిపల్ వ్యవస్థ నిర్మాణమవుతుందని చెప్పారు. పేదల కొరకు పౌర సదుపాయాలు కల్పించామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: