ఇప్పటికే గర్భాలయంలోకి నీరు వచ్చింది. వరద ప్రవాహం ఇలాగే ఉంటే మరో వారం రోజుల్లో గుడి పూర్తిగా మునిగి పోనుంది. ప్రతి యేటా కొన్ని నెలల పాటు కృష్ణమ్మ ఒడిలోనే ఒదిగిపోయి, పూజలకు దూరంగా వుంటాడు సంగమేశ్వరుడు. ఆలయం నీట మునిగిపోతుండడంతో పూజారి, భక్తులు ఈ ఏడాదికి చివరి సారిగా గుడిలో పూజలు నిర్వహించారు. జనవరి ఒకటవ తేదీన మొదలైన పూజలు నేటితో ఆగిపోతున్నాయని పూజారి తెలిపారు. సప్తనదుల సంగమేశ్వరాలయము ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి బయట పడి ఈరోజు గర్భాలయంలో నీళ్లు ప్రవేశిస్తున్నాయి. దాదాపు ఏడు నెలల పాటు భక్తులకు స్వామి దర్శనం ఇవ్వడం జరిగింది.2018వ సంవత్సరం జూలై 20వ తారీకు గర్భాలయంలోకి నీళ్లు రావడం జరిగింది.
ఈ సంగమేశ్వర క్షేత్రంలో మనం వరుణ యాగం చేయడమూ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం కోసం చేసిన ఈ వరుణ యాగం సత్ఫలితాలిచ్చిందని ఎన్నో సార్లు ఋజువయ్యింది. జూరాల నుంచి వస్తున్న నీటితో సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగిపోయిందనీ పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు చెబుతున్నారు. యాత్రికులు కూడా జలాశయం దగ్గర జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.