బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మరణం యావత్తు దేశాన్ని శోక సంద్రంలో ముంచెత్తేంది. బీజేపీలో పాపులర్ నాయకురాలుగా, పిన్న వయసులో క్యాబినెట్ పదవులు చేపట్టిన ఘనత సుష్మా స్వరాజ్ కే చెందింది. ఇంకా ఢిల్లీకి  తొలి మహిళా ముఖ్య మంత్రిగా సేవలు అందించింది. మోడీ క్యాబినెట్ లో విదేశాంగ శాఖ మంత్రిగా పని చేసి ప్రజల మన్ననలను అందుకున్నది. అయితే మనకు పెద్దగా ఎవరికీ తెలియని విషయమేమిటంటే వైస్ ఫ్యామిలీ అంటే సుష్మా స్వరాజ్ కు ఎంతో ఇష్టం. వైస్ రాజశేఖర్ రెడ్డి , వైస్ జగన్ మీద సుష్మా కు మంచి అభిప్రాయం ఉండేది. వైస్ ఫ్యామిలీ మీద ప్రత్యేక అభిమానం ఉండేది. 


వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ మీద కాంగ్రెస్ కేసులు పెట్టి జైల్లో పెట్టించినప్పుడు సుష్మా పార్లమెంట్ లో కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగింది. వైస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అంటే ప్రాణం ఇచ్చేవారని మిగతా నాయకులకంటే వైస్ గొప్ప నేత అని .. కష్టపడి కాంగ్రెస్ ను ఏపీలో అధికారంలోకి తెచ్చాడని ఇప్పుడు వైస్ చనిపోవటంతో తన కొడుకైన జగన్ ను ఇలా జైలు పాలు చేస్తున్నారని, జగన్ ఏం తప్పుచేశాడని ఇలా హింసిస్తున్నారని పార్లమెంట్ లో అప్పుడు ప్రతి పక్ష హోదాలో కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగింది. 


పార్టీలో కొనసాగితే ఒకలా .. లేకపోతే మరోలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని, అప్పట్లో సుష్మ స్వరాజ్ వైస్ జగన్ కు అండగా నిలిచింది. ఇప్పుడు ఆ పార్లమెంట్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అభిమానులు షేర్ చేస్తున్నారు. అయితే సుష్మ స్వరాజ్ ఈ రోజు ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతీ తెలిసిందే. ఎయిమ్స్ లో అధునాతున చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. సుష్మా మృతి పట్ల నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: