ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బ్యాడ్‌టైం కొన‌సాగుతోంది. ఆయ‌న కుమారుడు తేజ్ ప్రతాప్ విచిత్ర ప్రవర్తనపై స్వయంగా ఆయన భార్య ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదుతో క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడాది క్రిత‌మే లాలూ త‌న‌యుడు తేజ్ ప్ర‌తాప్ పెళ్లి చేసుకున్నాడు. కానీ అయిదు నెల‌ల‌కే భార్య ఐశ్వ‌ర్య‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ్డాడు. ఇదే విషయంపై కుటుంబంలో నిలదీసే సరికి ఎవరికీ కనిపించకుండా పోయాడు. దీంతో ఐశ్వర్య తన భర్త తేజ్ ప్రతాప్ విచిత్ర ప్రవర్తనపై ఫిర్యాదు చేస్తే తప్ప పూర్తి వివరాలు బయటికి రాలేదు. తాజాగా తేజ్‌ప్రతాప్ లీలలు ఒక్కక్కటీ బయటపడుతున్నాయి. 


ఐశ్వర్య సెక్షన్ 26 ప్రకారం తనకు రక్షణ కల్పించాలని కుటుంబ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఈ పిటీషన్‌లో పలు ఆసక్తికర అంశాలును వెల్లడించింది. ``బీహార్ మాజీ మంత్రిగా పనిచేసిన తేజ్ ప్రతాప్ ఓ విచిత్రమైన వ్యక్తి. రాధా, కృష్ణుడు, శివుడిలా తయారై అందర్ని ఆశ్చర్యపరుస్తుంటాడు. తనకు తానే దేవతామూర్తిని అనే భావన కలిగి ఉంటాడు. వీటన్నిటికీ తోడు డ్రగ్స్‌కు బానిస. అయితే ఇలాంటి వేషాలన్నీ గంజాయి దమ్ము బాగా తలకెక్కిన తర్వాత వేస్తుంటాడు``అని ఆయన భార్య ఐశ్వర్య కోర్టుకు తెలిపింది. గంజాయి కిక్కు బాగా ఎక్కిన తర్వాత గాగ్రచోళీ వేసుకుని రాధలా తయారుకావడం, అలాగే గంజాయి శివుని ప్రసాదం దాన్ని ఎలా వద్దంటాను? అంటూ దాన్ని ఫుల్‌గా తీసుకునే వాడట. తన భర్త విచిత్ర వేషాలపై స్వయంగా ఆమె ఫ్యామిలీ కోర్టుకు తెలిపి తనకు రక్షణ కల్పించాలని తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య న్యాయస్ధానాన్ని వేడుకుంది.


కాగా ఇప్ప‌టికే తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య నుంచి విడాకులు కోరారు. పెళ్లయి ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే ఆయన విడాకులు అడగడం గమనార్హం. అయితే లాలూతోపాటు ఆయన కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించలేదు. దీంతో తేజ్ ప్రతాప్ ఇల్లు వదిలి హరిద్వార్ వెళ్లారు. విడాకులు ఇప్పిస్తేనే తాను తిరిగి ఇంటికి వస్తానని ఆయన స్పష్టం చేశారు.
కాగా,  ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కూతురు, బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్‌. 2018 మే 12న తేజ్‌ప్రతాప్ పెళ్లి జరిగింది. అయితే కొన్నాళ్లకే వీళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అవి సమసిపోయే అవకాశమే లేదని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. నిజానికి పెళ్లికి ముందే విభేదాలు రావడంతో అప్పుడే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పానని, వాళ్లు పట్టించుకోకుండా పెళ్లి చేశారని ఆయన వాపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: