వైసీపీ ఎంపీ, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉదయం నుంచి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి మీకు సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు విజయసాయి రెడ్డి. 


పాడి అవులాంటి ఖజానాను పిండుకున్నది తమరే కదా అంటూ ట్విట్ పెడుతూ విమర్శించడం మొదలు పెట్టారు విజయసాయి రెడ్డి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు అంతర్గతంగా చేసిన రాజకీయాలన ట్విట్టర్ వేధికగా బహిర్గతం చేశారు విజయసాయి రెడ్డి. 'చంద్రబాబు మీపై అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తానని రాయబారాలు చెయ్యలేదా' అని ట్విట్ చేశారు.       


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టీడీపీని బిజెపిలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది మీరే కదా చంద్రబాబు గారూ? రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపీలోకి పంపించారు. ఇంకా మీపైన ఫిర్యాదు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా?' అంటూ ట్విట్ చేశారు విజయ సాయి రెడ్డి. మరి ఈ ట్వీట్లకు చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: