జేడీ లక్ష్మి నారాయణ ఇప్పుడు జనసేన పార్టీలో హాట్ టాపిక్ అయ్యారు. జేడీ కొన్ని రోజుల నుంచి జనసేన పార్టీ పనుల్లో గాని కార్యక్రమాల్లో గాని చురుక్కగా పాల్గొనడం లేదు. దీనితో జనసేనకు  జేడికి మధ్య దూరం పెరుగుతుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే జేడికి నిజాయతీ కలిగిన ఐపీఎస్ ఆఫీసర్ గా మంచి పేరు ఉంది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను డీల్ చేశారు. సత్యం కేసు కావొచ్చు .. గాలి జనార్దన్ రెడ్డి కేసు కావొచ్చు ఇలా చెప్పుకుంటూపోతూ దేశంలో ఎన్నో సంచలనం రేపిన కేసులను డీల్ చేసి మంచి అధికారిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


అయితే జేడీకి ఎన్ని కేసులను డీల్ చేసినా రాని గుర్తింపు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి కేసును డీల్ చేయడంతో ఎక్కడ లేనిహైప్ వచ్చింది. హైప్ వచ్చింది అనటం కంటే పచ్చ మీడియా ఎక్కువ ఉత్సాహం చూపించి, జగన్ ను విలన్ గా చూపించే క్రమంలో జేడీని వీరుడు, సూరుడు అంటూ తన పచ్చ పైత్యాన్ని బయట పెట్టిందని చెప్పాలి . కేసు వివరాలు జేడీ బయట పెట్టకముందే పచ్చ మీడియా వాటిని బయటపెట్టి నానా హంగామా చేసేది. 


జేడీ మహారాష్ట్ర పోలీసు విధుల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోని రాజకీయాల్లోకి వచ్చిన సంగతీ తెలిసిందే. మొదట్లో రాష్ట్రం మొత్తం తిరిగి రైతులతో సమావేశం అయ్యి, వ్యవసాయ సమస్యలను తెలుసుకొని అప్పటి సీఎం అయినా చంద్రబాబుకు తెలియజేశారు. అయితే జేడీని తమ పార్టీలోకి రావాలని ఇటు టీడీపీ నుంచి అటు జనసేన నుంచి ఆహ్వానం వచ్చింది. కానీ చివర్లో జనసేన లో జేడీ చేరినారు. అయితే జేడీ జనసేన పార్టీకి దూరంగా ఉండటానికి కారణం పవన్ వ్యవహార శైలి అని తెలుస్తుంది. జేడీకి పవన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కలవడానికి కూడా ఎక్కువ గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుందని జేడీ వర్గీయులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: