‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక మీకు మీరు గోమాత గా అభివర్ణించుకోవడం పెద్ద జోక్.’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదిక గా పలు విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారని, పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్ మూడేళ్లలో పూర్తయ్యేదన్నారు. 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేదని, ప్రధాన మంత్రి మోదీ అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబు కు ఏ కోశానా లేదని ఆయన ధ్వజమెత్తారు.
ఇటీవలే జరిగిన ఎన్నికలలో టీడీపీ నామమాత్రంగా 23 సీట్లతోనే సరిపెట్టుకుంది. టీడీపీ చరిత్రలోనే ఇది ఘోరమైన ఓటమి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆయన జమానాలో జరిగిన అవినీతిని వెలికితియ్యడానికి ప్రయత్నాలు చెయ్యడంతో ఆయనకు ఊపిరి సలపడం లేదు. ఈ క్రమం లోనే చంద్రబాబు టీడీపీ ని బిజెపి లో విలీనం చేస్తానన్నారా? అనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి.