కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘనతను ప్రపంచానికి తెలిసేలా న్యూయార్క్ లో ఒక కూడలి ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ పై పలు వార్తా కథనాలను ప్రసారం చేసింది. రోజుకు ఐదు సార్లు చొప్పున మొత్తం మూడు రోజుల పాటు గాయత్రి పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పదనాన్ని విశిష్టతలను వివరిస్తూ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్టోరీలను ప్రసారం చేసింది. ఈఫిల్ టవర్ ఎత్తును మించిన పొడవుతో గాయత్రి లక్ష్మీపూర్ పంప్ హౌస్ ను మేఘా ఇంజినీరింగ్ తీర్చిదిద్దింది. ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్ కళాఖండంగా ఈ పంప్ హౌస్ ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్ర నిలిచిపోయింది.ప్రపంచలోనే అత్యధిక సామర్ధ్యం ఉన్న పంపుహౌసులు నూట ముప్పై తొమ్మిది మెగావాట్ లను ఉపయోగిస్తూ నూట పదకొండు మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాలన్న సంకల్పంతో దీన్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకముందెన్నడూ లేనిది అందులోనూ భూగర్భంలోనిది. శక్తి రీత్యా, సామర్ధ్యాల ప్రకారం నీటి పంపింగ్ లక్ష్యం పరిమాణం ఇలా ఏ ప్రకారం చూసినా గాయత్రి పంపుహౌస్ ఇంజినీరింగ్ కళాఖండం.
మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాలలో చేరే అన్ని లక్షణాలూ దీనికున్నాయి. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంత వరకు ఎక్కడా నిర్మించలేదు. ఒక మిషన్ వారీగా చూస్తే సామర్థ్యం నూట ముప్పై తొమ్మిది మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద మిషన్ గా మారింది. మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారం చూసిన తొమ్మిది వందల డెబ్బై మూడు మెగావాట్లకు కూడా అతి పెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్ మోటార్ పంప్ హౌస్ లో కాకుండా మొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ ఇంత పెద్దది లేదు.