వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ పై ధ్వజమెత్తారు. 


లోకేష్ ను టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి ట్విట్టర్లో కామెంట్లు చేశారు. ఈ ట్విట్లకి నెటిజన్ల నుంచి వచ్చే స్పందన చూస్తే నవ్వకుండా అసలు ఉండలేరు. అంతగా విజయసాయి రెడ్డి ఎం కామెంట్ చేశారబ్బా విజయసాయి రెడ్డి ట్విట్ చేసారు. విజయ సాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలకు చిట్టినాయుడు ఐడియాలు ఇస్తున్నాడంటూ వ్యాఖ్య చేశారు. 


ఈ మేరకు ఆయన తన ట్విట్టర్లో ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నిటికీ చిట్టి నాయుడు విధ్వసంకర ఐడియా ఇచ్చాడు. టెర్రరిస్టులంతా తుపాకులు, బాంబులను పక్కకు పడేసి నాటు పడవలను ఆయుధాలుగా వాడాలని నిర్ణయించారట. డ్యాం గేట్లకు అడ్డం పెట్టి వరద ముంపును సృష్టించొచ్చని ప్లాన్ వేస్తున్నారట. ఎంతైనా స్టాన్ఫోర్డ్ లో చదివాడు కదా? అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు విజయసాయి.మరి ఈ ట్విట్ పై లోకేష్ ఎలా స్పంధిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: