నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గలేదా దివంగత నేత నందమూరి హరికృష్ణ మరణం తర్వాత వీరిద్దరూ కలిసినట్టు పైకి కనిపించినా... అదంతా పైపై మెరుగులు మాత్రమేనా ?లోపల వీరి మధ్య ఉన్న విభేదాలు అలాగే ఉన్నాయా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. గత ఏడెనిమిదేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ - బాలయ్య మధ్య సఖ్యత వాతావరణం లేదన్నది అందరికీ తెలిసిన నిజం.
2014 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ టిడిపికి ప్రచారం చేస్తాడని అందరూ అనుకున్నా ఆయన దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ టిడిపికి సపోర్ట్ చేశారు. తెలంగాణలో ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరి తరపున ప్రచారం చేయలేదు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారు. అదే టైంలో ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసిపిలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు.
ఇక లోకేష్కు అంత సీన్ లేదని అందరూ భావిస్తున్నారు. టీడీపీ కేడర్ కూడా జూనియర్ ఎన్టీఆరే ఆ పార్టీకి భవిష్యత్ లీడర్ అని అందరూ అనుకుంటున్న టైంలో బాలయ్య రెండో అల్లుడు ఎన్టీఆర్కు అదిరే షాక్ ఇచ్చేలా మాట్లాడాడు. ఇటీవలే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరుఫున విశాఖ పార్లమెంట్ సీటుపై పోటీచేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ‘చంద్రబాబు - బాలయ్య - లోకేష్ - మేమంతా ఉన్నాం కదా.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదు’ అని హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడీ మాటలు వైరల్ అయ్యాయి.
బాలయ్య చిన్నల్లుడు భరత్ మాటలు టీడీపీలో మంటలు పుట్టించాయి. టీడీపీకి ఎన్టీఆర్ లాంటి ఛరిష్మా ఉన్న నేతలు అవసరం లేదని... ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బాగుపడుతుందని తాను అనుకోవడం లేదన్నారు.. కేవలం ఎన్టీఆర్తోనే పార్టీకి జవసత్వాలు నింపే అవసరం వస్తుందని అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఏదేమైనా ఎన్టీఆర్ను చాలా లైట్ తీస్కొన్నట్టు మాట్లాడిన బాలయ్య చిన్నల్లుడు భరత్ తీరుపై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో భరత్ను టార్గెట్గా చేసుకుని పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎన్టీఆర్ను అనే స్థాయి భరత్కు లేదని విమర్శలు చేస్తున్నారు. ఇక భరత్ మాటలను బట్టి చూస్తే కూడా చంద్రబాబు - బాలయ్య ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని అర్థమవుతోందని మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ విషయం ఎప్పటకి చల్లారుతుందో ? చూడాలి.