ఏపీలో రాజధాని మార్పు విషయం పెద్ద డిబేట్ గా మారిన సంగతీ తెలిసిందే. అసలు వైసీపీ ప్రభుత్వం రాజధానిని మారుస్తున్నామని ఎక్కడ చెప్పలేదు.జ గన్ కూడా ఇప్పటి వరకు నోరు తెరిసి చెప్పింది లేదు. అయితే జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు బొత్స వ్యాఖ్యలను పట్టుకొని ప్రతి పక్ష పార్టీలు నానా హంగామా చేసినాయి. ఇందులో ఒకటి మాత్రం సుస్పష్టం. ఎలాగైనా జగన్ ప్రభుత్వం మీదకు ప్రజలను రెచ్చగొట్టాలని .. అయితే వైసీపీ నాయకులు ఎంత మంది చెప్పిన ప్రతి పక్ష పార్టీలు వినేటట్లు కనిపించడం లేదు. జగనే స్వయంగా రాజధాని విషయంలో నోరు తెరిసి చెబితే గాని ప్రతి పక్ష పార్టీలు కామ్ అయ్యేటట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా మీడియా డిబేట్ లలో కూర్చొని పెద్ద మేధావులుగా మాట్లాడే వాళ్ళ నోర్లు మూగబోయేటట్లు లేవు. కానీ జగన్ ఈ విషయంలో స్పందిస్తాడా .. లేదా అన్నదే అసలు విషయం. 


అయితే వైసీపీ  మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని టీడీపీ నానా హంగామా చేస్తుంది. నిజానికి బొత్స సత్య నారాయణ రాజధానిని మారుస్తన్నామని ఎక్కడ చెప్పలేదు. బొత్స చెప్పింది కేవలం .. అమరావతికి వరద పోటు ఎక్కువగా ఉందని నిర్మాణాలకు లక్ష రూపాయలు పెట్టే చోట రెండు లక్షలు పెట్టాలిసిన పరిస్థితి వస్తుందని చెప్పారు. అంతక మించి ఇంకేమి చెప్పలేదు. కానీ టీడీపీ మాత్రం తామేదో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించామని దానిని మార్చవద్దని తెగ బాధపడిపోతోంది. అమరావతి మార్పు అనేది ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం ప్రకటించలేదు. 


ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందని .. దొనకొండకు తరలిస్తారని చంద్రబాబు ఎన్నికల్లప్పుడు ఆరోపించారు. దాని ద్వారా ప్రజల్లో ఓట్లను పొందాలని చూశారు. పచ్చ మీడియా కూడా ఎన్నికలప్పుడు ఇలాంటి గాలి వార్తలే ప్రముఖంగా ప్రచురించి ప్రజల్లో కన్ఫ్యూషన్ ను క్రియేట్ చేయాలని చూశారు. కానీ ఏం జరిగిందో మనం చుసము. ప్రజలు చాలా క్లారిటీగా ఓట్లు వేసి జగన్ ను గెలిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: