లక్నో రైల్వే స్టేషన్తో వినూత్న విధానాన్ని ఇండియన్ రైల్వే మొదలు పెట్టబోతోంది. అదేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు మరి. ఏంటంటారా...అదేనండి అరటి "తొక్కలో రూల్" అంది బాబూ. ఎలుకను పట్టి కొండను తవ్వినట్టు.. రైల్వే అరటిపండ్ల వ్యాపారం మీద పడింది. అసలు విషయం ఏంటంటే దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లన్నింటిని పరిశుర్భంగా ఉంచేందుకు దృష్టి పెట్టింది. అదే తడవుగా కార్య రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే లఖ్నవూలోని చార్బాగ్ రైల్వేస్టేషన్లో అరటిపండ్ల అమ్మకాన్నినిషేధించారు. ప్రయాణికులు అరటిపండ్లు తినేసి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుండడం వల్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
ఈ చర్య వాళ్ళ స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని చెపుతున్నారు. అందుకే ఈ పండ్ల అమ్మకాన్ని నిషేధించినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఎవరైనా రైల్వేస్టేషన్ పరిసరాల్లో అరటిపండ్లు అమ్మినట్లు కనిపించినా, తమ దృష్టికి వచ్చినా వారికి జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు. దాంతో పాటుగా రైల్వే అనుమతి లేకుండా స్టేషన్ లో అరటి పండ్లు అమ్మితే ఆయా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారంట అధికారులు. ఈ విషయాన్ని చెప్పి ఓ చిరువ్యాపారి ఇక మేము ఎంత బతకాలంటూ వాపోతున్నారు. గత వారం రోజుల నుంచి అరటిపండ్లను అమ్మడం లేదని వెల్లడించాడు.
అసలు విషయం ఏమిటంటే ఈ అరటిపళ్ళు కూడా సీల్డ్ పాకెట్ల రూపంలో అమ్మకానికి కార్పొరేట్ సంస్థలు చేపడతాయట. తొక్కలు కూడా వాళ్లే కలెక్ట్ చేసుకుంటారట. చివరి ఈ కార్పొరేట్ సంస్థలన్నీ చిరు వ్యాపారులని కూడా బతకానిచ్చేలా లేరన్నమాట. ఇప్పటికే సంస్కరణ పేరిట రైల్వే పలు వినూత్నమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్లాస్టిక్ వేదికపైన ఆంక్ష విధించింది. తాజాగా మట్టి గ్లాసులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
దాంతో పాటుగా రైల్వే అనుమతి లేకుండా స్టేషన్ లో అరటి పండ్లు అమ్మితే ఆయా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారంట అధికారులు. ఈ విషయాన్ని చెప్పి ఓ చిరువ్యాపారి ఇక మేము ఎంత బతకాలంటూ వాపోతున్నారు. గత వారం రోజుల నుంచి అరటిపండ్లను అమ్మడం లేదని వెల్లడించాడు.
దాంతో పాటుగా రైల్వే అనుమతి లేకుండా స్టేషన్ లో అరటి పండ్లు అమ్మితే ఆయా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారంట అధికారులు. ఈ విషయాన్ని చెప్పి ఓ చిరువ్యాపారి ఇక మేము ఎంత బతకాలంటూ వాపోతున్నారు. గత వారం రోజుల నుంచి అరటిపండ్లను అమ్మడం లేదని వెల్లడించాడు.