ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజనులు దశాబ్దకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలు శాశ్వతంగా తీరబోతున్నాయి. ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి చొరవతో వారి చిరకాల కల నెరవేరబోతుందనే చెప్పాలి. గురువారం సీఎం వై.యస్.జగన్ అధ్యక్షతన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష సమావేశం జరిగింది. గిరిజనులకు అటవీభూములపై పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఈవిషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి దృష్టి పెట్టాలన్నారు.అదే విధంగా ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని సిఏం జగన్ ఆదేశించారు. మొత్తం మీద ఈ సమావేశంలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. వైయస్సార్ చేయూత కింద లబ్దిదారులను గుర్తించే పని మొదలు పెట్టాలన్నారు.
వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా రూ.18750లు, సంతృప్తికర స్థాయిలో వైయస్సార్ చేయూత రాజకీయాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ అందాలని స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా పథకాల అమల్లో పారదర్శకత ఉండాలన్నారు.
జగన్ అరుకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, దోర్నాలలో ఐటీడీఏల్లో సూపర్ స్పెషాల్టీ హాస్పటిల్స్
ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఆమేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే కాకుండా సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో క్వాలిటీ ఉండాలన్నారు. ఆ దిశగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అంతడితో సరిపెట్టుకోకుండా అధికారులు క్రమంగా తప్పకుండా వాటిని పరిశీలించాలని, తనిఖీలు చేసి కనీస సౌకర్యాల ఉన్నాయో లేదో చదలన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలన్నారు.
స్కూళ్లకు సంబంధించి 9 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. మూడు దశల్లో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మంచాలు, బ్లాంకెట్స్ సహా అన్ని సౌకర్యాలూ హాస్టళ్లలో ఉండాలన్నారు. మూడు దశల్లో ఈ పనులు పూర్తికావాలని సీఎం జగన్ సూచించారు. హాస్టళ్లలో పిల్లలకు మంచాలు ఉన్నాయా? లేవా? దుప్పట్లు ఉన్నాయా? లేవా? అల్మరాలు ఉన్నాయా? లేదా? వీటన్నింటినీ పరిశీలించి.. ఈ కనీస సదుపాయాలను కల్పించాలన్నారు. అంతే కాకుండా డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. హాస్టళ్లలో వసతుల సౌకర్యం కోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా? లేదా? అన్నదానిపై సీఎం ఆరా తీయగా అందుకు అధికారులు ఇచ్చామని చెప్పారు.
టాయిలెట్స్ను ప్రతి హాస్టల్లో వెంటనే ఏర్పాటు చేయాలని, అది కూడా ప్రయార్టీ ప్రకారం చేయాలన్నారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్మన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారమ్స్, పుస్తకాలు అందాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలన్నారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ వర్కుల్లో కచ్చితంగా యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని ఆదేశం. కలెక్టర్లకు స్పష్టంగా చెప్పాలన్న సీఏం జగన్ సూచించారు.