మన భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా హిందూ సనాతన ధర్మం ప్రకారం అద్భుతమైన నిర్మాణ ఆకృతితో అతి పురాతనమైన కట్టడాలు ఉన్నాయి. అయితే ఇటీవలే బాలీ నగరంలోని పెముటెరన్ తీరం సముద్ర గర్భంలో ఒక పురాతన దేవాలయం కనుగొనబడింది . ఈ దేవాలయం చాలా పురాతనమైనది . కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు . పర్యాటకుల సందర్శన నిమిత్తం రెండు వేల ఐదులో దీనిని టెంపుల్ గార్డెన్ గా మార్చారు .


హిందూ సనాతన ధర్మం ప్రకారం అద్భుతమైన నిర్మాణ ఆకృతితో ఈ కట్టడం నిర్మించబడింది . సముద్ర గర్భంలో ఉన్న ఈ హిందూ దేవాలయం ఒకప్పుడు భూమిపైన ఉండేదనీ సముద్రం ముంచెయ్యటం వలన ఇది మునిగి పోయిందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది . ఈ దేవాలయంలో హిందూ దేవుళ్లు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వినాయకుల విగ్రహాలు చాలానే ఉన్నాయి . ఇది సముద్ర మట్టం నుండి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉంది.


ఈ గుడి ముఖభాగం ఎత్తు నాలుగు కిలో మీటర్ల కంటే ఎక్కువగా ఉంది. ఈ దేవాలయం పై పరిశోధనలు చేయడానికి పురావస్తు శాఖ రంగంలోకి దిగింది. ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఈ గుడిని చూశారట. రెండు వేల సంవత్సరాల కాలంలో అతను దీనిని మళ్లీ పునర్ నిర్మించటానికి ఎంతో ప్రయత్నించారట . అయితే రెండు వేల ఐదు లో అతను ప్రమాదవశాత్తూ నీటిలోనే మునిగి చనిపోయారంట. ఆ తరువాత రెండు వేల పదిలో దీనిని డెవలప్ చేశారు. అప్పటి నుండి చాలా మంది పర్యాటకులు కేవలం ఈ గుడిని చూడటానికే ఇండోనేషియాకి తరలి వస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: