చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి .. అమరావతి అంటూ ఎప్పుడు చూసిన బాబు గారు భజన చేసేవారు. ఈ భజన భరించలేక ప్రజలు బాబుగారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అమరావతి విషయంలో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడేమో చంద్రబాబు నేను ఆదాయాన్ని సృష్టించే రాజధానిని నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని తెగ భాద పడిపోతున్నారు. నిజానికి అమరావతి వల్ల ఆదాయం చేకూరింది టీడీపీ నేతలకు మాత్రమే. అయితే బాబు ఐదేళ్లలో నోరు తెరిస్తే చాలు అమరావతి .. అమరావతి ఎంత హడావుడి .. కానీ చివరికి రాజధానిలో కనీసం శాశ్వత ప్రభుత్వ భవనాలు కూడా లేని పరిస్థితి. చివరికి రాజధాని ప్రాంతంలో కూడా బాబు గారి పార్టీ గెలవకుండా పోయిన పరిస్థితి. 


లేనిదే ఉంది అని చెప్పడం. అబద్దాన్ని నిజం చేయడం గ్లోబల్ ప్రచారం అంటారు. ఇవన్నీ వెరసి టీడీపీ హయాంలో ప్రజలకు చంద్రబాబు మీద ఆ పార్టీ మీద చిరాకు, కసి అన్నిటినీ తెప్పించింది. అందుకే జనాలు చారిత్రత్మక తీర్పును ఇచ్చారు. టీడీపీ మారకుంటే పరిస్థితి ఇలానే ఉంటుందని నిరూపించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ముఖ్యంగా అమరావతి విషయంలో ప్రజలను ఘోరంగా మోసం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇది సోషల్ మీడియా లేని పాత రోజులు కాదు కదా ! ఏది దాచిన వెంటనే సోషల్ మీడియాలో దొరికిపోతారు. రాజమౌళి మహాస్మతి అనే రాజ్యాన్ని ఎలా సృష్టించారో చంద్రబాబు అమరావతి అనే రాజ్యాన్ని సృష్టించారు. 


 నిజంగా ఆ ప్రపంచం అనేది మనకు కనిపించదు. ఇప్పుడు అదే మాదిరిగా తయారైంది. ఏపీ కలలు రాజధాని అమరావతి. గత ఐదేళ్లలో అమరావతి ఇలా ఉందని .. ఒక కొత్త ప్రపంచాన్ని పత్రికల్లో బాబుగారు చూపించారు. పచ్చ మీడియా కూడా అమరావతి గురించి లేనివి .. ఉన్నవి అన్నీ చూపించింది. కానీ ఇప్పుడు రియల్ అమరావతిని చూస్తే అందులో ఏమి లేదు. ఐదారు బిల్డింగ్స్ తప్పితే చెప్పుకోడానికి ఏమి లేకుండా పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: