కాశ్మీర్ ఇప్పుడు పూర్తిగా భారత్ లో అంతర్భాగం అయిపొయింది. దీనితో పాక్ లో ఎక్కడ లేని వణుకు పుట్టింది. ఇన్ని రోజులు కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతి పత్తిని అడ్డు పెట్టుకొని కాశ్మీర్ లోపలకి ఉగ్రవాదులను పంపి మారణ హోమం జరిపేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అయితే పాక్ .. కాశ్మీర్ విషయంలో నానా హంగామా చేసింది. కానీ ప్రపంచ దేశాలు పట్టించుకోలేదు. ఇప్పుడేమో కాశ్మీర్ ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ పాక్ లో ర్యాలీని నిర్వహిస్తూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అయితే ఎప్పుడైతే కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అయ్యిందో .. ఇప్పుడు భారత్ కళ్ళు పీఓకే మీద పడ్డాయి. దీనితో పాక్ లో అసలైన వణుకు పుడుతుంది. 


 ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు. అయితే కాశ్మీర్ విషయంలో ఐరాస పట్టించుకోకపోవడంతో . .పైగా ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పడంతో పాక్ ఎక్కడ లేని అసహనానికి గురవుతోంది. అందుకే విచక్షణ కోల్పోయి రాబోయే రోజుల్లో భారత్ తో పూర్తి స్థాయి యుద్ధం తప్పదని పిచ్చి కూతలు కూస్తుంది.


మా దగ్గర అను బాంబులు ఉన్నాయి అంటూ ఇమ్రాన్ ఖాన్ పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతున్నారు. దీనితో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిలా మారింది. కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లి ట్రంప్ తో మాట్లాడి కాశ్మీర్ విషయాన్ని రెచ్చగొట్టానని చాలా అనందం పడ్డారు. ట్రంప్ కూడా నేను మధ్య వర్తిత్వం చేస్తానని చెప్పడంతో ఇమ్రాన్ ఖాన్ చాలా సంతోష పడ్డారు. ఎప్పటికైనా కాశ్మీర్ ను తాము దక్కించుకుంటామని పాకిస్థాన్ అనుకుంటూ వచ్చింది. అయితే నరేంద్ర మోడీ ఇమ్రాన్ ఎత్తులకు పై ఎత్తు వేసి అస్సలు కాశ్మీర్ కు ఉన్న అధికారాలను తొలిగించి ఏకంగా భారత్ లో కలిపేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: