విజయవాడ-గూడూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబరు 1వ తేదీన ప్రారంభించటానికి రైల్వే అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పంచ జెండా ఊపి  ఈ ఇంటర్ సిటీ రైల్ ను పాటలెక్కించనున్నారు. ఈ సందర్భంగా  ఇండియన్ రైల్వే అధికారులు  ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేష్‌ అంగడి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్‌ నుంచి నడిచే ఈ రైలు సొంతజిల్లా కావటంతో గూడూరు నుంచి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. విజయవాడ-గూడూరు మధ్య రోజూ ఈ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ తిరుగుతుంది.ఈ రైలుకు విజయవాడ డివిజన్‌ అధికారులు 12743/12744 నెంబర్‌ కేటాయించారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి రెగ్యులర్‌ సర్వీసుగా నడుస్తుంది.
 సెప్టెంబరు 2 నుంచి రోజూ ఉదయం 6 గంటలకు గూడూరులో బయల్దేరుతుంది. ఉదయం 10.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.10 గంటలకు విజయవాడ నుంచి ఈ రైలు వెళ్తుంది. రాత్రి 10.40 గంటలకు గూడూరు చేరుకుంటుంది. ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబరు 1 ఉదయం 9.30 గంటలకు గూడూరులో బయల్దేరుతుంది.మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడ వస్తుంది. 
నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలిలో ఆగుతుంది. 
ఈ రైలు పూర్తి చైర్‌కార్‌గా ఉంటుంది. మొత్తం 14 బోగీల్లో రెండు గార్డు బోగీలు పోనూ 12 బోగీలు ఉంటాయి. వీటిలో రెండు ఏసీ చైర్‌కార్‌ ఉంటాయి. మిగిలిన 8 బోగీలు నాన్‌ ఏసీ. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు తేదీపై రాని స్పష్టత మరో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ ఎక్‌ ్సప్రెస్‌ ప్రారంభోత్సవ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. విశాఖపట్నం నుంచి విజయవాడకు నడిచే డబుల్‌ డెక్కర్‌ ఏసీ సూపర్‌ ఫాస్ట్‌ రైలును సెప్టెంబరులోనే ప్రారంభించాల్సి ఉంది. అయితే, తేదీ మాత్రం ఖరారు కాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: