సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటి మట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడు భక్తులు వెళ్లి దర్శనం చేసుకోవడం సహజమే. కానీ అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యమైపోతూ అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్ లోని సాంబేశ్వర్ ఆలయాన్నీ దర్శించాల్సిందే. ఈ ఆలయం గుజరాత్ లోని వడోదర నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోని కాలి కాంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడ అరేబియా సముద్రంలో ఉన్న ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులు. శివుని కుమారుడైన కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం అందరికీ తెలిసిందే.


తారకాసురుడు లోకకంటకుడే కావచ్చు కానీ అతను మహా శివభక్తుడు అలాంటి శివభక్తిని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాతాపంతో కుమిలిపోయాడు. తాను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడు. కార్తీకేయిని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తి శివభక్తుడి పట్ల జరిగిన అపచారం శివపూజ తోనే తొలగి పోతుందని సూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్థంబేశ్వర్ ఆలయంలోని మూల విరాట్. స్థంబేశ్వర్ ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయిన దీని చుట్టూ వున్న ఆలయాలన్నీ మాత్రం నూట యాభై ఏళ్ల క్రితమే నిర్మించారు.


చాలా సాదాసీదాగా కనిపించే ఈ ఆలయం అద్భుత నిర్మాణం ఏమి కాదు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న స్థలపురాణం వల్లనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపించడం మరో విశేషం. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్క అంగుళమే ఈ ఆలయం బయటపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్లీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మురిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర నుంచి సముద్ర గర్భంలోకి వెళ్లిపోవడం వరకు మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దనే వేచివుంటారు. చంద్రుని కలలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది.


సముద్రం మంచి పోటు మీద ఉండే అమావాస్య, పౌర్ణమి రోజులలో శివుడుని దర్శనం కోసం కాస్త ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది స్థంబేశ్వర ఆలయం యొక్క విశేషాలు. ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అనేది చెప్పడం కష్టం. ఏమైనా శివుడు అభిషేకప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు.

ఈ ఆలయం సమీపంలోని మహీనది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్థంబేశ్వరుని దర్శించుకునేందుకు వేలాది మంది ఇక్కడకు చేరుకుంటారు. శివ పుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వ దోషాల నుంచి విముక్తుడైన విధంగానే ఈ లింగాన్ని దర్శించుకున్న వారు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం.




మరింత సమాచారం తెలుసుకోండి: