వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిపక్షాన్ని విమర్శించడమే పనిగా భావించే విజయసాయి రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఏ తప్పులు ఉన్నాయో ఆ తప్పులు అన్ని వెతికి మరి వెలికి తీస్తుంటారు విజయసాయి రెడ్డి. ఏదో సాధించాలని ప్రతిపక్ష పార్టీ నాయకులూ మాట్లాడే తప్పుడు మాటలను ట్విట్టర్ వేదికగా తీసుకొచ్చి విజయసాయి రెడ్డి సరి చేస్తుంటారు. 


ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబుపై ఫైర్ అయ్యాడు విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారు తండ్రీ కొడుకులు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయి. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే తెలుసు వాటికి.  మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారు చంద్రబాబు'' అంటూ ట్విట్ చేస్తూ నారా లోకేష్ ని ట్యాగ్ చేశారు విజయసాయి రెడ్డి.  


ఈ ట్విట్ కు నెటిజన్లు స్పందిస్తూ బూతులు తిడుతున్నారు, కొందరు విజయసాయి రెడ్డికి మద్దతు ఇస్తే మరికొందరు విజయసాయి రెడ్డిని తిడుతున్నారు. కొందరు వాటిని అంతం చెయ్యండి అంటే మరి కొందరి అవి విశ్వాసంగా అయినా ఉంటాయి కదా అని అంటున్నారు. మరికొందరు స్పందిస్తూ ఏంటి విజయన్న మీరు మంచి హోదాలో ఉన్నారు.. ప్లీజ్ ఇలాంటి మాటలు మాట్లాడకండి అంటూ ట్విట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: