బుద్ధా వెంకన్న ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్న ఈ మధ్యనే ఫేమస్ అవ్వడం మొదలెట్టాడు. ఆ ఫేమస్ ఎలా అనుకుంటున్నారా ? గత నెల కేశినేని నాని ట్విట్ పెట్టడం వల్ల ఫేమస్ అయిపోయారు వెంకన్న గారు. ఇతను ఎమ్మెల్సీ అయినప్పటికీ కేశినేని నాని ట్విట్ చేస్తే కానీ ఇతని గురించి అందరికి తెలియలేదు. అంత ఫేమస్ చేశారు కేశినేని నాని. ఒక్క ట్విట్ తో బుద్ధా వెంకన్న ట్విట్ స్టార్ అయిపోయాడు. 


అయితే ఇప్పడు విషయానికి వస్తే విజయసాయి రెడ్డి చేసిన ట్విట్లకు రిప్లయ్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డిపై విరుచుకు పడ్డాడు బుద్ధ వెంకన్న. అంతగా ఎం ట్విట్ చేశారు అని అనుకుంటున్నారా ? చేశాడు. చంద్రబాబు నాయుడు హింస రాజకీయాలు మొదలు పెట్టుంటే మీరు ఎవరు ఉండే వారు కాదు అంటూ ట్విట్ చేశాడు బుద్ధా వెంకన్న. 


బుద్ధా వెంకన్న ట్విట్ చేస్తూ 'నెత్తిన తాటికాయ పడిన గుంటనక్కలాగా విజయసాయి రెడ్డి తాతయ్య ట్విట్టర్ లో ఓ మూలుగుతా ఉంటారు. అయ్యా! పత్తిత్తు కబుర్లు అంటారు. మిమ్మల్ని చూసినా, మీ మాటలు విన్నా పత్తిత్తే గుర్తుకువస్తోంది. రాజకీయ హింసలో పిహెచ్ డి చేసినోళ్ళ వైపు నిలబడి నీతులు మాట్లాడితే ఎలా చంద్రబాబు గారు రాజకీయ హింస మొదలుపెట్టి ఉంటే ఈరోజు ఈ పిచ్చి కూతలు కూయడానికి మీరుండేవారు కాదేమో! ముందు మీ మూతులకు, చేతులకు అంటిన రక్తాన్ని తుడుచుకోండి.' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు బుద్ధా వెంకన్నకు ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు.. మరికొందరు ఈ ట్విట్లు చూసి ఆశ్చర్య పోతున్నారు. ఏంటి వెంకన్న ఇంకా మీ చంద్రబాబు హింస రాజకీయం చెయ్యలేదా ? ఏం మాట్లాడుతున్నావ్' అంటూ ట్విట్లు చేస్తున్నారు. మరికొందరు ట్విట్ చేస్తూ ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ ట్విట్లు చుసిన నెటిజన్లు 'ఛీ ఇంతటి చీఫ్ రాజకీయాలు ఎందుకు బుద్ధా' అంటూ ట్విట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: