ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రన్న చేసిన పనుల్లో వైసీపీ ప్రభుత్వం ఒక్క పని కూడా సక్రమంగా చెయ్యలేదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.


నారా లోకేష్ ట్విట్ చేస్తూ చంద్రన్న హయాంలో పండుగా ఉంది అంటే ప్రత్యేక జీవోతో రెండు మూడు రోజుల ముందే ఉద్యోగులకు జీతాలు అంధ చేసే వారని, కానీ జగనన్న హయాంలో ఈ వినాయక చవితి పండుగకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకుండా రెండు రోజులు సెలవులు అని చెప్పి మూడోవ తారీఖు జీతాలు ఇస్తా అంటున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నారా లోకేష్.


అయితే ఈ వ్యాఖ్యలకు స్పందించిన నెటిజన్లు 'మీరు అంటే అనుభజ్ఞులు, 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలవారు.. కానీ మేము కాదు కదా ఎందుకు ఈ మాటలు అని ఒకరు అంటే.. మరి కొందరు స్పందిస్తూ అన్ని పండగలకు మీరు ఇలాగె ప్రత్యేక జీవోతో జీతాలు ఇచ్చార అని మరి కొందరు అంటున్నారు. మరి కొందరు స్పందిస్తూ 'డప్పు కొట్టుకోవడం తప్ప ఏమి చేతకాదు. ఆ ప్రజలే మిమ్మల్ని పక్కన పెట్టారన్న విషయం మరువకు' అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: