మాంసాహారులలో ఎక్కువ మంది తినేది చికెన్. చాలా చౌక ధరకు లభించే నాన్ వెజ్ ఐటెమ్ ఇది. చికెన్ తినేవారిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది. అది మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. అందుకే బాడీబిల్డర్లు వెనుకాడకుండా చికెన్ తింటారు. కానీ ప్రొటీన్ అంత తేలికగా జీర్ణం కాదు. దానిని జీర్ణం చేయాలంటే శరీరం అదనపు శక్తిని కూడదీసుకుని మెటబాలిజం రేట్ని వేగవంతం చేయాలి.
ఇదిలా ఉంటే కొందరు కోడి కాళ్ళను కూడా ఇష్టపడి వాటితో వెరీటీ డిషెస్ చేసుకుని తింటుంటారు. వాటితో చాలా రకాల డిషెస్ని చేయవచ్చు. చాలా మంది పురాతన కాలం వాళ్లు ఎక్కువగా ఇష్టపడి తినే ఫుడ్ ఇది. అయితే ఇది ఇక్కడే కాదండోయే వేరే దేశాల్లో కూడా వాటికి చాలానే డిమాండ్ ఉంది. చాలా మందికి ఇవంటే ఇష్టం. ముఖ్యంగా చైనీస్ వాళ్లకు ఇవంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఇప్పుడు వాళ్లకు కష్టం తెచ్చిపెట్టింది. కోడి పేరు చెపితే చాలు కోట్ల మందికి నోరూరతది. కోడి కనిపిస్తే చాలు. ఫ్రై అని, మసాలా అని, రెక్కలు అని ఇలా వివిధరకాలు వండుకుని తింటారు. అయితే చైనాలో మాత్రం కోడికాళ్లంటే చాలా ఇష్టం. అక్కడ వాటిని ఎన్ని రకాలుగా వండికుని తినాలో అన్ని రకాలు వండుకుంటారు. అక్కడ స్ట్రీట్ ఫుడ్లో కూడా కోడి కాళ్లదే హవా. ఇప్పుడు ఇదే అక్కడ పెద్ద సమస్యగా మారింది. పబ్లిక్ ఇష్టంగా తింటున్నారు కదా అని పాడయిన కోడికాళ్లకి కాస్తంత హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసి తాజాగా కనిపించేటట్లు చేస్తున్నారంట. ఏదో ఒకచోట రెండో చెట్ల అనుకుంటున్నారా కాదు దాదాపుగా 20టన్నుల కుళ్లిన కోడి కాళ్లు నానింగ్ అనే ఊరిలో ఒక్కటే చోట బయట పడ్డాయట. అవి ఎన్ని రోజుల కిందవో తెలుసా రోజులు నెలలు కాదు ఏకంగా కొన్ని సంవత్సరాల కిందవట. అవికూడా 49 ఏళ్ల కిందవట. 60 టన్నులు అంటే 20కిలోలంట. ఇన్నేళ్లు ఎందుకు ఉంచారు అని అంటే 1940లో చైనాలో మావో కాలంలో ఉన్నప్పుడుచికెన్కు విపరీతమైన గిరాకి ఉండడంతో అప్పట్లో చికెన్నో బ్లాక్ చేసి చాలా రేటు పెట్టి అమ్మేవాళ్లట. అప్పట్లో ఏవేవో కెమికల్స్ వేసి కవర్లలో పెట్టి ఉంచేవాళ్లు అవి మొన్న చెకింగ్లో బయట పడ్డాయి. ఇప్పడు ఆ విషయం అక్కడ బయటపడేసరికి పబ్లిక్ అంతా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారట. కోడికాళ్లను ముద్దుగా ఫెన్జావో అని పిలిచేవారు. ఇప్పుడు జియాంగి ఫెన్జావో అని పిలుస్తున్నారు. అంటే కుళ్లిన కాళ్లని జోంగి ఫెన్జావో అని అంటే చరిత్రగల కాళ్లని ఇంటర్నెట్లో జోకులు వేసుకుంటున్నారు. అలాగే జిన్నూవా అనే రోగం కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా అక్కడ జరుగుతుంది.అంటే అది పక్షవాతం లాంటి జబ్బు.
దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే. అలా అని చికెన్, గుడ్లు మానేయాల్సిన అవసరం లేదు. ఏ ఆహారమైనా సరే తాజాగా తింటే ఆరోగ్యానికి మంచిది. అంతేగాని దాన్ని మరుగున పెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని వైద్యులు చెపుతున్నారు.