ఎన్నికల్లో జనసేన ఓటమితో ఏపీలో జనసేన రేంజ్ ఏంటో తెలిసి పోయింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి. జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ కూడా నామ రూపాలు లేకుండా పోయిన పరిస్థితి. అలాంటిది ఇక జనసేన గురించి ఏం చెప్పగలం. ఎన్నో అంచనాల నడుమున ఎన్నికల్లో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయ్యింది.


పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం ఇంకా ఘోరమైన విషయం. అయితే ఎన్నికల్లో జనసేన ఓడిపోవడానికి కారణం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కనీసం ఎన్నికల మూడేళ్ళ నుంచైనా ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయలేకపోయారు. అప్పుడప్పుడు ట్విట్టర్లో స్పందించడం .. అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చి రావటం .. పోవటం చేస్తుండటంతో జనాలు పూర్తిగా జనసేనను విశ్వసించే పరిస్థితి రాలేదు. సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ  ... వైసీపీ ముందు జనసేన నిలవలేక పోయింది. 


అయితే పవన్ కళ్యాణ్ గత ఎన్నికలో తమ ఓటమికి కారణం ఏంటో తెలుసుకున్నంటున్నారు. అందుకే ఈ సారి క్షేత్ర  స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఫామ్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన పార్టీ కమిటీలలో ఒక కులానికి మాత్రమే ప్రాధాన్యత ఉండదని చెప్పుకొచ్చారు. అన్ని కులాల వారికీ అవకాశం ఉంటుంది. కేవలం కాపు కులాల వారిని నమ్ముకొని రాజకీయాల్లో రాలేదని పవన్ చెప్పుకొచ్చారు. కానీ పవన్ మాటలు ఎప్పటిలాగే ఉన్నాయని .. ఇటువంటి మాటలతో పవన్ ..  పార్టీని నిలబెట్టడం కష్టమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: