ఆ తర్వాత దివంగత నేత జయంతి రోజున మళ్లీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పట్లో వైఎస్ పేద ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినందున, ఆయన గుర్తుగా అక్కడే వైఎస్ విగ్రహ ప్రతిష్ఠను ఎవరూ అడ్డుకోలేకపోయారు. నిజానికి గతంలో కంటే ఈసారి ఆకర్షణీయంగా వైఎస్ విగ్రహం ఏర్పాటుచేశారు. అందులో జీవకళ ఉట్టిపడుతోంది.
అయితే.. టిడిపి ప్రభుత్వ హయాంలో విజయవాడలో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో 64 దేవాలయాలు, అందులో ఉన్న దేవతా విగ్రహాలను రోడ్ల అభివృద్ధి పేరిట తొలగించారు.అందులో చాలా విగ్రహాలను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక మూలన పడేయడం వివాదానికి దారితీసింది.
అయితే.. పోలీసు కంట్రోలు రూము వద్ద వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన జగన్ ప్రభుత్వం, అదే రీతిలో కూల్చిన దేవాలయాలు, తొలగించిన దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించకపోవడంపై హిందు సంస్థల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీన్నిబట్టి.. వైఎస్ విగ్రహంపై ఉన్న శ్రద్ధ, దేవతా విగ్రహ ప్రతిష్ఠపై లేదన్న విషయం స్పష్టవుతోందని విరుచుకుపడుతున్నారు. గతంలో దేవాలయాల పునర్మిర్మాణంపై హామీ ఇచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఉన్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
‘జగన్ ప్రభుత్వానికి తన తండ్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో ఉన్న ఆసక్తి, హిందూ దేవాలయాల పునర్మిర్మాణాలపై లేదనడానికి ఇదే నిదర్శనం. గోశాలలో వంద ఆవులు చనిపోతే ఇంతవరకూ దానికి కారణాలు బయటపెట్టలేదు. విశాఖలో చర్చిలను పరిరక్షించాలని స్వయంగా సీపీనే ఆదేశాలిచ్చారు. జగన్ ప్రభుత్వం కేవలం ఒక మతానికే ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలని బిజెపి ధార్మిక సెల్ అధ్యక్షుడు తూములూరు చైతన్య ప్రశ్నించారు.