సాధారణ జీవితంలో కష్టం తెలియకుండా పెరిగిన ఈ డెబ్బై నాలుగేళ్ల ఆర్థికవేత్త రాత్రంతా చెరసాలలో చెక్కతో చేసిన బల్ల మంచంపై నిద్రించారు. దానిపై తాను పడుకోలేనని ఓ మంచం ఏర్పాటు చేయాలని ఆయన జైలు అధికారులను కోరారు, కానీ వారు అంగీకరించలేదు. వైద్యులు పరీక్ష చేసి ఇమ్మంటేనే ఇస్తామని స్పష్టం చేయడంతో ఆయన మరేమీ చేయలేకపోయారు. ఆయన సరిగ్గా నిద్ర పోలేదనీ అశాంతిగా విసుగ్గా కాస్తంత ఆందోళనగా గడిపారని జైలు వర్గాలు తెలిపాయి. వెస్ట్రన్ టాయిలెట్ ఉన్న గదిని ప్రత్యేకంగా కేటాయించడం మినహా ఆయనకు మరే ఇతర సౌకర్యాలూ కలగ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆయన ఉన్న ఏడో నెంబర్ సెల్ లోని గతంలో చిదంబరం కుమారుడు ప్రస్తుత ఎంపీ కార్తీ చిదంబరం కూడా పన్నెండు రోజుల పాటు ఉన్నారు.
సాధారణ జీవితంలో కష్టం తెలియకుండా పెరిగిన ఈ డెబ్బై నాలుగేళ్ల ఆర్థికవేత్త రాత్రంతా చెరసాలలో చెక్కతో చేసిన బల్ల మంచంపై నిద్రించారు. దానిపై తాను పడుకోలేనని ఓ మంచం ఏర్పాటు చేయాలని ఆయన జైలు అధికారులను కోరారు, కానీ వారు అంగీకరించలేదు. వైద్యులు పరీక్ష చేసి ఇమ్మంటేనే ఇస్తామని స్పష్టం చేయడంతో ఆయన మరేమీ చేయలేకపోయారు. ఆయన సరిగ్గా నిద్ర పోలేదనీ అశాంతిగా విసుగ్గా కాస్తంత ఆందోళనగా గడిపారని జైలు వర్గాలు తెలిపాయి. వెస్ట్రన్ టాయిలెట్ ఉన్న గదిని ప్రత్యేకంగా కేటాయించడం మినహా ఆయనకు మరే ఇతర సౌకర్యాలూ కలగ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆయన ఉన్న ఏడో నెంబర్ సెల్ లోని గతంలో చిదంబరం కుమారుడు ప్రస్తుత ఎంపీ కార్తీ చిదంబరం కూడా పన్నెండు రోజుల పాటు ఉన్నారు.