సినీనటుడు,చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ అంటే తెలియని వారుండరు.ఈయన పరిచయం అక్కర్లేని వ్యక్తి.సినీనటుడిగా తన జీవితంలో ఎంతమందికి తెలుసో తెలియదో కానీ ఆయన చేసే నిరసనల ద్వారా మాత్రం జాతీయ స్థాయిలో పేరుగాంచారు.శివప్రసాద్ వేషాలకు జాతీయ నేతలు సైతం ఫిదా అయ్యారు.ఇక ప్రధాని నరేంద్రమోదీ పైనా, కేంద్రప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్లమెంట్ ఆవరణలో శివప్రసాద్ తన వేషధారణలతో నిరసన తెలపడానికి ముగ్ధురాలయ్యారు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ. అంతేకాదు సమావేశాల నుంచి బయటకు వచ్చి శివప్రసాద్ ను అభినందించడంతోపాటు ఓ సెల్ఫీకూడా దిగారు.అటువంటి శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.



వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపొలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.స్వతహాగా సినీ నటుడైన శివప్రసాద్‌ ఎంపీగా ఉన్నప్పుడు తన విలక్షణ శైలి,విచిత్ర వేషధారణలతో నిత్యం వార్తల్లో ఉండేవారు.ప్రత్యేక హోదా ఉద్యమం సందర్భంగా ఎంజీ రామచంద్రన్, కరుణానిధి,అంబేడ్కర్..ఇలా రోజుకో వేషంతో పార్లమెంటు ముందు నిలబడి నిరసన తెలిపేవారు.ఇక వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు.శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు ఆసుపత్రి వర్గాలకు సూచించారు.



ఇకపోతే చంద్రబాబునాయుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ క్లాస్‌మేట్స్.తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో వీరిద్దరూ కలిసి చదువుకొన్నారు.తిరుపతి నుండి ఆయన పలు దఫాలు ఎంపీగా విజయం సాధించారు.గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడ పనిచేశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో పాటు పలు సమకాలీన అంశాలపై పార్లమెంట్ ఎదుట వినూత్న రీతిలో వేషాలు వేసి తన నిరసనను తెలిపేవాడు శివప్రసాద్. ప్రత్యేక హోదా విషయంలో ఎంపీ శివప్రసాద్ చేసిన వినూత్న నిరసనలపై పార్లమెంట్ లోనే మోడీ ప్రస్తావించడం విశేషం..

మరింత సమాచారం తెలుసుకోండి: