రోజు రోజుకు సమాజం ఎంతలా దిగజారుతుందంటే వావివరసలు లేవు.దయా,జాలి అక్కరలేదు,పశువులకంటే హీనంగా,తయారవుతుంది.ముందుముందు సమాజంలో మనుషులు కనిపించేలా అగుపించడంలేదు.మనిషి రూపాల్లో ఉన్న తోడెళ్లు కనిపించేలా అనిపిస్తుంది.అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తూవుంటే.ఇక్కడ అలాంటి ఓ సంఘటనే జరిగింది.తండ్రే కామంలో ఆరితేరాడంటే,వాడికొడుకు ఆ తండ్రితో కలసి ఓ మహిళతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసాడు.అదేమైన మందుగ్లాసా తండ్రికొడుకులు మార్చి,మార్చి పంచుకోవడానికి అని అనుకుంటారేమో.అది ఆ వెధవ పనికి ప్లాన్ వేసిన వాళ్లకు తెలియాలి.ఈ మ్యాటర్ అంతా నమ్మకం అనే ఓ ముసుగు చాటున జరిగింది. వివరాల్లోకి వెళ్లితే..



ఓ మహిళకు వివాహం అయిన తర్వాత కొంతకాలానికి భర్త నుంచి విడిపోయి వేరుగా నివాసముంటోంది.ఈమె బాణసవాడిలో ప్రైవేటు కంపెనీని ఉద్యోగి.సదరు మహిళకు సర్పదోషం వుందని తెలియడంతో,తనకు పరిచయం వున్న వారి ద్వార,కామస్వామి గణేశ్,అతడి కుమారుడు మణికంఠను సంప్రదించింది.మొదటి చూపులోనే ఆమెపై కోరికను పెంచుకున్న కామస్వామి గణేశ్,మణికంఠ ఇద్దరు సర్పదోష నివారణ చేస్తామని అది రాత్రి సమయాంలో అయితేనే ఫలితం వసుందని చెప్పి ఆమెతో కలసి రాత్రి 10 నుంచి 11 గంటల వరకు మహిళ ఇంట్లోనే పూజలు నిర్వహించారు.పూజ అనంతరం పూజచేసిన వస్తువులను కుక్కేసుబ్రమణ్యలో వదలాలని అందుకు ఆమెకూడా తమతో రావాలని సూచించారు.



ఈ సమయంలో తండ్రి,కుమారుడు కుక్కె సుబ్రమణ్యలో రెండు ప్రత్యేక గదులు బుక్‌ చేసుకుని మహిళతో కామవాంఛ తీర్చుకోవడానికి పథకం రూపొందించారు.దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు వారి పన్నాగాన్నిపసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న బాణసవాడి పోలీసులు తీవ్రంగా గాలించి గురువారం కామస్వామి గణేశ్,కుమారుడు మణికంఠను అరెస్ట్‌ చేసి తమదైనశైలిలో విచారణ చేపట్టగా సర్పదోషం ఉందని నివారణకు ఐదుసార్లు తమతో తాళికట్టించుకోవడమే గాక,మరో ఐదుసార్లు లైంగిక ప్రక్రియలో పాల్గొనాలని మహిళను వేధించిననట్లు ఆ కామాంధులు తెలిపారు.ఇంకేముంది కేస్ ఫైల్ వారిద్దరు జైల్.నిజంగా జనం పిచ్చోళ్లు కాకపోతే ఏంటండి ఎవరు ఏది పడితే అది చెప్పితే నమ్మడం ఆనక పోలిస్‌స్టేషన్ మెట్లు ఎక్కడం కామన్‌గా మారింది లోకంలో... 

మరింత సమాచారం తెలుసుకోండి: