ఒక నాయకుడు పోతే..వందమంది నాయకులను తయారు చేసుకుందామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్ధవంతమైన సైనికులను తయారు చేస్తామన్నారు. మళ్లీ ఈ ప్రాంతంలో టీడీపీ తిరిగి రెపరెపలాడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు వారి స్వార్థంతో పోయారన్నారు. సెప్టెంబర్ 14 హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టి.టీడీపీ 17 పార్లమెంట్ సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ..కొందరు నాయకులు పోయిన పార్టీకి వెన్నుదన్నుగా   కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. బయటకు పోయినవాళ్ళు మాత్రం ఒంటరి వాళ్ళయ్యారని వ్యాఖ్యానించారు. కానీ మిగిలిన ఎమ్మెల్యే మచ్ఛా నాగేశ్వర్ రావు.. పార్టీ కోసం అంకితం అయ్యారని కొనియాడారు. 



మీరు నిస్వార్థంతో వచ్చారు. ఈ ప్రాంతంలో టీడీపీ బలోపేతం కావడానికి మీరంతా కలిసికట్టుగా కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇద్దరిని గెలిపిస్తే.. ఒక్కరు పోయారు. ఏ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో నూతన నాయకత్వం టిడిపికి అవసరమని అభిప్రాయపడ్డారు.
తెలంగాణాలో పార్టీ పున:నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు తెలిపారు.  నాయకత్వ లోపాన్ని దిద్దుకోవాలని సూచించారు. 119 నియోజకర్గస్థాయిలో పార్టీ ఎల్లప్పుడూ పునర్నిర్మాణం చేస్తూ ఉన్నామన్నారు. హైదరాబాద్ లో టిడిపి పుట్టిందని, ఎన్టీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణలో టిడిపి బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించానని చెప్పారు. ప్రతి శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వస్తానని తెలిపారు. ఎవరైనా




ఎప్పుడైనా తనతో నేరుగా మాట్లాడొచ్చని..అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. టిడిపి తెలంగాణలో ఉండటం చారిత్రక అవసరం అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎన్నో చేశానని తెలిపారు. తెలంగాణాలో ఎవ్వరు బయపడవద్దన్నారు. వచ్చే శనివారం మళ్ళీ సమావేశం అవుతానన్నారు. కమిటీలు వేస్తాను.. మళ్ళీ క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. టిడిపిపై అభిమానం ఉన్న వాళ్ళు ముందుకు రావాలన్నారు. అన్ని స్థాయిల్లో సమర్ధ నాయకులను పెడ్తామని చెప్పారు. తెలంగాణాలో శక్తివంతమైన పార్టీగా ఎదగాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: