మూడు దశాబ్దాల కాలంలో వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. విధిలేని పరిస్థితుల్లో పడవ ప్రయాణాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న పడవ ప్రమాదాలు ఎంతోమందిని బలిగొంటున్నాయి. శనిఆదివారాలు సెలవులు కావడంతో తెలంగాణ, ఏపీకి చెందిన అనేక మంది పాపికొండల యాత్రకు వచ్చారు. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విజయవాడ కృష్ణానదిలో బోటులో విహారానికి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు. 2017 నవంబర్ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన సంభవించింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరగడం గమనార్హం.
ఈ ఆదివారం దేవీపట్నం మండలం కచ్చలూరులో సంభవించిన దుర్ఘటన ఇదే ప్రాంతంలో మూడోది కావడం గమనించతగ్గ అంశం. ఇదిలా ఉండగా అప్పట్లోనే 120మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తమై బోటును సమయస్ఫూర్తితో ఒడ్డుకు చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా గమనార్హం. వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలో రామాలయంలో 1985లో నిర్వహించిన శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురై 40 మంది మృతిచెందారు. ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో 1990లో పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో పది మంది చనిపోయారు. ఐ.పోలవరం మండలం పరిధిలోని గోగుళ్లంక–భైరవలంక మధ్య చింతేరుపాయ వద్ద 1992లో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం చెందారు.
బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై పడవ దాటుతుండగా బలమైన గాలులకు పడవ బోల్తా పడింది. 1996లో జరిగిన ఈ దుర్ఘటనలో పదిమంది వరకు కూలీలు చనిపోయారు. యానాం–ఎదుర్లంక వారధి నిర్మించక ముందు గౌతమీ గోదావరి నదీ పాయపైన
2004లో.. జరిగిన పలు పడవ ప్రమాదాల్లో 10మంది వరకు మృతిచెందారు. 2007లో జరిగిన ఓడలరేవు–కరవాక రేవు మధ్య ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఇంజిన్ చెడిపోవడంతో గాలికి పడవ సముద్రం వైపు కొట్టుకుపోతుంది. ఈ ప్రమాదాన్ని గూర్చి అప్రమత్తమైన పడవ నిర్వాహకులు మరో పడవ ద్వారా అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాదులు 2008లో పాపికొండల విహారయాత్ర చేపట్టారు. పాపికొండలు వెళ్ళితిన్న తరుణంలో పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
వశిష్ట సాగర సంగమం సమీపంలోని అంతర్వేది–బియ్యపు తిప్ప మధ్యలో 2009లో పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న పడవ మునిగి పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు బలయ్యారు.మంటూరు వద్ద 50 మందితో వెళ్తున్న లాంచీ బోల్తాపడిన ఘటనలో 19 మంది జలసమాధి అయ్యారు. 2018 మే 15న జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతదేహాలను వెలికితీయడానికి మూడ్రోజులు శ్రమించాల్సి వచ్చింది.ఐ.పోలవరం మండలం పశువుల్లంకవద్ద 2018 జులైలో పడవ బోల్తా పడింది.ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు లభ్యంకాని పరిస్థితి. తాజాగా జరిగిన బోట్ బోల్తా ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందిన ఏపీ సీఎం జగన్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఏరియల్ సర్యే నిర్వహించడంతో పాటుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భాదితులను పరామర్శించి వారిలో ఆత్మస్తైర్యాన్ని నిప్పారు.