ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి స్పెషల్ గా ట్విట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర మోదీ ఈరోజుతో 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70లోకి అడుగు పెట్టారు. దీంతో దేశం మొత్తం నుంచి ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


గత 5 ఏళ్లుగా ప్రధాని మోదీ పాలన ఎంతో అద్భుతంగా ఉడటంతో దేశ వ్యాప్తంగా, ఇంకా విదేశాలలో అయన అభిమానులు భారీగా ఉన్నారు. దీంతో ఈరోజు అయన పుట్టిన రోజు సందర్బంగా వాళ్ళ పద్ధతిలో మోదీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ట్విట్టర్ లో అయనకు  పుట్టిన రోజు శుభాకాంక్షలు భారీగా వెలువెత్తుతున్నాయి. ట్రేండింగ్ నెంబర్ 1 నుంచి 5 వరుకు అయన పుట్టిన రోజు శుభాకాంక్షలే ఉన్నాయి.   


ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విట్టర్ వేధికగా ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. 'గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంత ఇలానే సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలి' అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో జగన్ అభిమానుల నుంచి మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: