ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ , టీడీపీ సీనియర్ నేత కోడెల ఆత్మహత్య ఆంధ్ర రాజకీయాల్లో  సంచలనం రేపింది . కోడెల ఆత్మ హత్య నేపథ్యంలో ఆంధ్రాలో శవ రాజకీయాలు చేసేందుకు టీడీపీ భావిస్తుందని పలువురు ఆభిప్రాయ పడుతున్నారు . వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి కోడెల పై అక్రమ కేసులు బనాయిస్తూ మానసింకంగా వేదించిందని అందువల్లే కోడెల ఆత్మ హత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు .కాగా 37  సంవత్సరాల కోడెల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదోన్నతులు చేపట్టారు. కొన్ని సార్లు ఓటమిని చవి చూసారు . అలాంటి కోడెల శివ ప్రసాద్ రావు కి ఈ కేసులు విమర్శలు కొత్తేమి  కాదు . మరి అలాంటిది ఈ కేసుల వల్లనే కోడెల చనిపోయారని టీడీపీ ఎలా అంటుందని పలువురు భావిస్తున్నారు .


అయితే టీడీపీ నేతలు చేస్తున్న  ఆరోపణలపై వైసీపీ నేతలు గట్టిగానే బదులు ఇస్తున్నారు .కోడెలను సమర్థవంతగా స్పీకర్ పదవి నిర్వర్తించకుండా ...చంద్రబాబు అడ్డుకున్నారని...టీడీపీ లో ఎన్నో  సేవలందించిన  కోడెలను బాబు పక్కన పెట్టారని... చంద్రబాబు చేసిన అవమానం వల్లే కోడెల ఆత్మ హత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు .


ఈ నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చంద్రబాబు పై  విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని ఓ సర్కస్ ట్రూప్ గా మార్చారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు .చంద్రబాబు  ఓ చోట టెంట్ వేసి  జనం పొగవ్వగానే షో మొదలు పెడతారని ..అయితే సర్కస్  కి వచ్చినా వాళ్లంతా టీడీపీకి  ఓటు వేస్తారని చంద్రబాబు భావించి హుషారు అయిపోతారని విమర్శించారు .కానీ సర్కస్  చూసి చప్పట్లు కొట్టినవారు ఆ తర్వాత అది మర్చిపోతారన్న విషయం చంద్రబాబుకు ఎప్పటికీ అర్థం కాదని చంద్రబాబు పై విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: