అనంతపురం జిల్లా జేమ్స్ బాండ్ జేసీ దివాకరరెడ్డి కి హైకోర్టు బ్యాండ్ వేసింది.అనంతపురం జిల్లాలోని లైమ్‌స్టోన్‌ మైనింగ్‌ లీజు వ్యవహారంలో తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. సున్నపురాయి మైనింగ్ లీజు కోసం త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ మోసాలకు పాల్పడిందని, దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ 2011లో ప్రజాప్రయోజాల వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సహా త్రిశూల్‌ సంస్థ నిర్వహణ భాగస్వామి ఎస్‌ హుస్సేన్‌ భాషాలతోపాటు ఎస్‌.గోపాలరావు, తిమ్మాపురం దేవపుత్రుడు, జె.నాగ సుబ్బారాయుడు, కె.సిలాస్‌లు ఇందులో ఉన్నారు.ఇది హైకోర్టు హై లెవల్ డెసిషన్..ఈ మేరకు  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ల కూడిన ధర్మాసనం బుధవారం కీలక ఆదేశాలిచ్చింది. అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామ పరిధిలోని 1605 ఎకరాల్లో సున్నపురాయి తవ్వకానికి త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీకి 2006 ఏప్రిల్ 25న నాటి ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ జీవో 125ను విడుదల చేసింది.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తాడిపత్రికి చెందిన వి.మురళీప్రసాద్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. మోసపూరితంగా మైనింగ్ లీజును పొందారని, ఇందులో జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన త్రిశూల్‌ సిమెంట్స్‌లో భాగస్వాములు, బినామీల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.బుధవారం ఈ పిల్ విచారణకు రాగా పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఈ పిల్ వెనుక పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనమేమీ లేదని, 2012 మార్చి 7న ఉమ్మడి హైకోర్టు దీనిపై విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిందని గుర్తుచేశారు.

ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తాజాగా మరోసారి నోటీసులు జారీచేస్తూ ఆదేశాలు వెలువరించింది. తదుపరి విచారణను అక్టోబరు నాలుగో వారానికి వాయిదా వేసింది.యాడికిలో పెన్నా సిమెంట్స్‌కు కూడా నాటి వైఎస్ ప్రభుత్వం 114 ఎకరాల అసైన్డ్‌ భూములను బెదిరించి వెనక్కు తీసుకుని, ఆ సంస్థకు కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కూడా కేసు నమోదుకావడంతో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

పెన్నా ప్రతాప్ రెడ్డికి చెందిన పెన్నా సిమెంట్స్, పయనీర్ హోటల్స్‌కు చేకూర్చిన లబ్ధికిగాను రూ.53 కోట్ల పెట్టుబడులను జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనే అభియోగాలపై ఈడీ ఆస్తులను జఫ్తు చేసింది. అయితే, ఈ అభియోగాలపై ఆధారాలు లేవని ఇటీవలే అప్పీలేట్ అథారిటీ తీర్పును వెలువరించింది.అన్నీ రోజులు మనవి కావు..అన్నీ అక్రమాలు అన్యాయాలు మాత్రం మనవి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: