హైదరాబాద్ కేంద్రంగా గుట్టుచప్పుడు కొన్ని ద‌శాబ్దాలుగా సీక్రెట్ వ్య‌భిచార దందా కొన‌సాగుతోంది. మెట్రో న‌గ‌రంగా ఉన్న హైద‌రాబాద్‌లో విదేశీ యువ‌తుల‌ను తీసుకు వ‌చ్చి మ‌రీ ఈ దందా చేయిస్తున్నారు. ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానికంగా ఎన్ని దాడులు జ‌రుగుతున్నా... పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా ఇది కంట్రోల్ కావడం లేదు. తాజాగా విదేశీ యువ‌తుల‌ను తీసుకు వ‌చ్చి మ‌రీ వ్య‌భిచార దందా న‌డుపుతున్న వైనాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) పసిగట్టింది.


ఉగ్రవాదులు - తీవ్రవాదం - నక్సలిజం లాంటి భారీ కేసుల్లో ఇన్ వాల్వ్ అయ్యే ఎన్ ఐఏ తాజాగా విదేశీ యువతులతో హైదరాబాద్ లో సాగిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని గుట్టు రట్టు చేయడం సంచలనంగా మారింది. ఎన్ ఐ ఏ రంగంలోకి దిగి వ్య‌భిచార దందాను ప‌సిగ‌ట్టింది అంటే దీని వెన‌క ఎంత పెద్ద మ్యాట‌ర్ ఉంటుంద‌న్న సందేహాలు వ‌స్తున్నాయి.


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే హైద‌రాబాద్‌పై న‌జ‌ర్ పెరిగింది. ఈ క్ర‌మంలోనే ఉగ్ర‌వాదం వైపు ఆక‌ర్షితులు అవుతోన్న యువ‌కుల‌పై ప్ర‌ధానంగా కాన్‌సంట్రేష‌న్ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా వ్య‌భిచారం చేస్తోన్న విదేశీ యువ‌త‌ల‌ను కూడా ప‌ట్టుకోవ‌డంతో ఇక్క‌డ ఎన్ ఐ ఏ నిఘా ఎలా ఉందో తెలుస్తోంది. పాత‌బ‌స్తీలోని యూసుఫ్ ఖాన్ బేగం దంపతులు బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.


స్థానిక పోలీసుల స‌హ‌కారంతో వీరిని చాలా తెలివిగా ప‌ట్టుకున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో విదేశీ అమ్మాయిల‌తో వ్య‌భిచార దందా న‌డుపుతోన్న సంఘ‌ట‌న‌లు ఎక్కువ‌వుతున్నాయి. రెండు రోజుల క్రిత‌మే పంజాగుట్ట పోలో లాడ్జిలో విదేశీయులైన ఉబ్జెకిస్తాన్ యువతులతో చేయిస్తున్న వ్యభిచారం రట్టు అయ్యింది. ఇక ఎవ్వ‌రికి దొర‌కుండా ఉండేందుకు చాలా సీక్రెట్ ప్రాంతాల‌ను ఎంచుకుంటున్నారు. అయినా పోలీసుల నిఘాలో వారు దొరికిపోతున్నారు. ఇక తాజాగా ఎన్ ఐ ఏ దాడులు చూస్తే న‌గ‌రంలో చీమ‌చిటుక్కుమ‌న్నా... ఎలాంటి అసాంఘీక కార్య‌క్ర‌మాలు జ‌రిగిన డేగ క‌ళ్ల‌తో ప‌రిశీలిస్తుంద‌ని తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: