తన అందం అభినయంతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. తన నటనలో డిఫరెంట్ స్టైల్ ను చూపిస్తుంది. అయితే ఈ అమ్మడు నటనలోనే కాదు నిజజీవితంలోనూ కాస్త డిఫరెంట్. అందుకే ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతోంది సోనాక్షి. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోనాక్షి సిన్హా.. ఇప్పుడు తాజాగా మరోసారి తన జవాబుతో విమర్శల పాలవుతోంది. దీంతో ఆమె షాకింగ్ జవాబుతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకీ సోనాక్షిసిన్హా ఏం చేసింది అంటారా...
గతవారం సోనాక్షి సిన్హా మీలో ఎవరు కోటీశ్వరుడు హిందీ వర్షన్ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం కి వెళ్ళింది. అయితే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సోనాక్షి సిన్హా కి రామాయణానికి సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఏదో పెద్ద కష్టమైన ప్రశ్న కాదు లెండి అందరికీ తెలిసిన సింపుల్ ప్రశ్న. ఇంతకీ ప్రశ్న ఏంటంటే రామాయణం ప్రకారం హనుమంతుడు సంజీవని ఎవరికోసం తెచ్చాడు... ఈ ప్రశ్న సోనాక్షి సిన్హాకు ఎదురవ్వగా ఈ అమ్మడు సమాధానం చెప్పలేక పోయింది. లైఫ్ ఇన్ తీసుకొని కూడా తప్పు సమాధానం చెప్పింది. దీంతో అక్కడున్న వాఖ్యాత అమితాబచ్చన్, సోనాక్షి తల్లి పూనమ్ సహా అక్కడున్న వారందరూ షాక్ కి గురయ్యారు. అయితే సోనాక్షి ఇచ్చిన జవాబు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. కనీసం సోనాక్షికి రామాయణంలోని ఈ సులువైన ప్రశ్నకు జవాబు కూడా తెలియదా నెటిజన్లు సోనాక్షి ఫైర్ అవుతున్నారు.
అయితే సోనాక్షి పై నెటిజన్లు ఎక్కువగా రియాక్ట్ అవడానికి గల కారణాలు కూడా లేకపోలేదు. సోనాక్షి తండ్రి శత్రుఘ్నసిన్హా ఏకంగా తన ఇంటికి రామాయణ అని పేరు కూడా పెట్టుకున్నారు. అంతేకాదు తన ఇద్దరు కుమారులకు రాముడి కుమారుల పేర్లయిన లవకుశ అనే పేర్లు పెట్టాడు. రామున్ని తన కుటుంబం ఇంతగా ఆరాధిస్తుండగా సోనాక్షి మాత్రం ఇచ్చిన ప్రశ్నకు జవాబు తెలియదా అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. అయితే సోనాక్షి సిన్హా జవాబు పై తాజాగా యూపీ మంత్రి సునీల్ భరాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా విమర్శించారు. సోనాక్షి సిన్హ ఓ ధన పశువు అని... ఈ కాలంలో కేవలం డబ్బు కోసమే ఇలాంటి నటులు బతుకుతున్నారని... డబ్బు సంపాదించడం ఖర్చు పెట్టడం తప్ప వీరికి ఏం ఆలోచన ఉండదని... దేవుళ్ల గురించి ఏం తెలుస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు.