గతేడాది మిర్యాలగూడలో చోటుచేసుకున్న ప్రణయ్ అమృత పరువుహత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. కుల వివక్షతో ప్రణయ్ దారుణ హత్యకు గురైనా అతని భార్య అమృతకు మాత్రం ఇంకా వేధింపులు ఆగలేదు. ఈ నెల 11 తో సరిగ్గా ప్రణయ్ మృతి చెంది సంవత్సరం అయ్యింది. దీంతో ప్రణయ్ వర్ధంతి రోజు ఓ ఆకతాయి బెదిరింపుతో కూడిన లేఖను తలుపుకు అంటించాడు.           


ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అమృత ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో హోండా షైన్ బైక్ పై వచ్చిన ఆకతాయి దర్జాగా ఇంటి తలుపుకు లెటర్ అంటించి వెళ్లారు. ఇంటికి వచ్చిన తర్వాత లేఖ చుసిన కుటుంబసభ్యులు భయపడ్డారు. ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించారు.                   


రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లెటర్ లో సతీష్ అనే వ్యక్తి ఫొటోతో పాటు కొన్ని వివరాలను దుండగుడు పొందుపరిచాడు. ఆ లేటర్ లో ప్రణయ్‌ని మర్చిపోయి.. మరో పెళ్లి చేసుకోవాలంటూ లేఖలో రాశాడు. కాగా ఇటీవలే కాలంలో మరో పెళ్లి చేసుకో అని ఆమెకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయని, గతంలో కూడా ఆమెకు బెదిరింపు మెసేజీలు, కాల్స్‌ రావడంతో అమృత, ఆమె కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో కొంతకాలంగా అవి ఆగిపోయాయిని కానీ ఇప్పుడు అవి పునరావృతం అవుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషయంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమెకు ఆలా బెదిరింపు కాల్స్ వస్తే మీరు ఎం చేస్తున్నారు అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: