టాలీవుడ్ లో ఇస్మార్ట్ శంకర్ విడుదలై ఎంత గొప్ప విజయాన్ని సొంతం చేసుకుందో తెలుసిందే . ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ ప్రభంజనం సృష్టించింది. ఎప్పుడు క్యూట్ గా సాఫ్ట్ గా కనిపించే రామ్  ఇస్మార్ట్ శంకర్ లో ఊర మాస్ లుక్ తో  కనిపించడం... తెలంగాణ యాసలో డైలాగులు ఇరుగ తీయడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. డబుల్ దిమాక్ తో రామ్ నటన అదిరిపోయేలా ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

 

 

 

 అయితే ఈ స్మార్ట్ శంకర్ విడుదలైన కొన్ని రోజుల వరకు ఇస్మార్ట్ శంకర్ మేనియా నడిచింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో నభా నటేష్,  నిధి అగర్వాల్ హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు  చెమటలు పట్టించారు. అయితే ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకనిర్మాతలైన   పూరి జగన్నాథ్,  ఛార్మి, హీరో రామ్ కి ఇస్మార్ట్  శంకర్ సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని నింపింది.ఈ  ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు  ఇస్మార్ట్ శంకర్ మూవీ నీ మళ్ళీ కొన్ని థియేటర్లలో రిలీజ్ చేయబోతుంది చిత్రబృందం . ఈ విషయాన్ని చిత్ర నిర్మాత చార్మి ప్రకటించారు.

 

 

మీ థియేటర్లలో నా  సినిమా డబుల్ దిమాక్ ఇష్మార్ట్ శంకర్ మళ్ళీ సందడి చేయనుంది. ప్రేక్షకులు అందరు మరో సారి ఇష్మార్ట్ శంకర్ ని చూసి ఎంజాయ్ చేయండి అంటూ సినిమా నిర్మాత ఛార్మి వెల్లడించింది.  కాగా ఈ సినిమాని అక్టోబర్ 27న తెలుగు  రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.తెలంగాణ థియేటర్లు... దిల్ సుఖ్ నగర్-వేంకటాద్రి, కరీంనగర్ -తిరుమల, వరంగల్ -లక్ష్మణ్, ఖమ్మం -ఆధిత్య, కాజీపేట్ -భవాని థియేటర్లలో ఇష్మార్ట్ శంకర్ రీ రిలీజ్ అవుతుండగా...ఏపీలో రాజమండ్రి -ఊర్వశి, కాకినాడ -దేవి, తిరుపతి -విఖ్యాత్, గుంటూరు -స్వామి, వైజాగ్ -గోకుల్ థియేటర్లలో ఇస్మార్ట్ శంకర్ విడుదలవ్వ బోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: