దేశంలో రోజు రోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వాలు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.. కామందుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా హర్షగూడలోని ప్రసాద్ రెడ్డి పౌల్ట్రీఫామ్ లో అత్యాచార ఘటన వెలుగు లోకి వచ్చింది. పహాడీషరీఫ్ లో ఓ ఫౌల్ట్రీ లో వివాహిత మహిళపై మూడు రోజులుగా నలుగురు వ్యక్తులు అత్యాచారం. 

ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బాధిత మహిళ, భర్తకు బెదిరింపులు. పహాడీషరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకుంటామని చెప్పినప్పటికీ బాధిత మహిళా బంధువులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు. 

ఓ మహిళను దారుణంగా అత్యాచారంచ చేయడమే కాకుండా చంపేస్తామని బెదిరించిన నింధితులను వెంటనే అరెస్ట్ చేయాలని బంధువులు డిమాండ్, ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు తప్పించుకున్నారు..వారిని వెంటనే పట్టుకుంటామని కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: