విశాఖపట్నం చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు ఈరోజు సాయింత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో వాకింగ్‌ చేస్తుండగా బైక్ 'ఢీ' కొనడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో తీవ్రంగా గాయపడిన సత్యా రావునుహుటాహుటిన తోటి మిత్రులు, కుటుంబీకులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.     


 అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే బలిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించారని తెలుసుకున్న ఆప్తులు, అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. బలిరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా పనిచేసిన సత్యారావు అప్పట్లో విశాఖ కీలకనేతగా వ్యవహరించారు.                                              


1989, 1999లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బలిరెడ్డి విజయం సాధించారు. బలిరెడ్డి మరణించిన సంగతి తెలుసుకున్న రాజకీయ నాయకులు బలిరెడ్డి మృతిపట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కాగా బలిరెడ్డి సత్యారావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.                                                                                                             

                             

మరింత సమాచారం తెలుసుకోండి: