నీలోఫర్ ఆస్పత్రి ఒకప్పుడు మెరుగైన వైద్యానికి మారుపేరు. చిన్నపిల్లలకి ఏ సమస్య వచ్చినా నీలోఫర్ ఆసుపత్రి కి వెళితే తప్పకుండా ఆ సమస్య తీరిపోతుందని అందరూ భావించేవారు. అక్కడ మెరుగైన వైద్యులు ఉంటారు తమ పిల్లలకి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తారు అని  భావిస్తారు పిల్లల తల్లిదండ్రులు . అయితే నిలోఫర్ ఆసుపత్రి కి వెళ్తే ఏ సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది అనుకుంటారు... కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం నీలోఫర్ ఆస్పత్రే  పెద్ద సమస్యగా మారింది. అక్కడి వైద్యులు యమకింకరులు మారి పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

 

 

 చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన పిల్లలను క్లినికల్ ట్రయల్స్ పేరుతో బలి తీసుకుంటున్నారు. వైద్యుల రాక్షసత్వానికి ఎంతో మంది పిల్లలు బలైపోయారు ఇప్పటికే. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను నలతగా  ఉందని నిలోఫర్ ఆసుపత్రి కి తీసుకెళ్తే అక్కడి వైద్యులు మాత్రం వారిపై క్లినికల్ ట్రయల్స్ చేసి విగత జీవులను  చేస్తున్నారు.

 

 

 ఎంతో ప్రతిష్ట కలిగిన నీలోఫర్ ఆసుపత్రిలో ఇలాంటి దాష్టీకాలు జరగడం సిగ్గుచేటు. అయితే గత కొంత కాలంగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నీలోఫర్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కరువైంది. ప్రస్తుత నీలోఫర్ ఆసుపత్రి పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ లా మారింది. ఎంతో పేరున్న నిలోఫర్ ఆసుపత్రి లో మాత్రం చిన్నపిల్లలకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారైన మందుల పనితీరుని పరీక్షించేందుకు నిలోఫర్  ఆసుపత్రికి తీసుకువచ్చి వాటిని  చిన్నపిల్లలపై ప్దాయోగించి పిల్లల ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు . ప్రాణాలు కాపాడే డాక్టర్లు దేవుళ్ళ అంటారు. ఇక్కడ డాక్టర్లు మాత్రం మొత్తం ప్రాణాలను హరించేవారే . నీలోఫర్ ఆస్పత్రి వైద్యుల నిర్వాకంతో ఎంతో మంది తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగి పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: