గత కొంత కాలంగా మావోయిస్టులకు పోలీసులకు మద్య వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విశాఖ ఏజెన్సీలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో భవాని అలియాస్ కళావతి అనే మావోయిస్టు తీవ్రంగా గాయపడింది.
గతవారం జరిగిన గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు ఎన్కౌంటర్లో గాయపడిన అరుణ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరుణతో పాటు గాయపడిన మరో మావోయిస్టు సభ్యురాలు భవానీ పెదబైలు దళానికి చెందిన సభ్యురాలిగా పోలీసులు గుర్తించారు. కాగా, భవాని కాళ్లలో రెండు బుల్లెట్లు దిగాయని..వాటికి శస్త్ర చికిత్స చేసిన్టులు వైద్యులు తెలిపిరు. మీడియా కంట పడకుండా భవానిని తీసుకు వెళ్లిన పోలీసులు.