రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సర్వసాధారణం పైగా మన బాబుగారికి అయితే ఇవి చాల సహజమైన విషయాలు కూడా. కాకపోతే గెలిచినప్పుడు తన గొప్పగా.. ఓడినప్పుడు అది సహజం అని బాబుగారు సెలవిస్తారు. అయితే మళ్లీ గెలిచేదాకా పనిచేయడం బాబుకి వ్యసనం. ప్రస్తుతం ఆ గెలుపు కోసమే జగన్ ప్రభుత్వం పై ఈ మధ్య బాబు పదునైన ఆరోపణలను చేస్తూ ముందుకు పోతున్నారు బాబుగారు. పైగా తెలుగు తమ్ముళ్ళో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ఎక్కడా శాంతి భద్రతలు లేవని.. చివరకి 'వైకాపా ప్రభుత్వ బాధితుల పునరావాస కేంద్రం' పెట్టాల్సిన అవసరం వచ్చిందని బాబు తరుచుగా ఆరోపణలు చేస్తున్నారు. అలాగే 'గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు ప్రస్తుత ప్రభుత్వం పున:సమీక్షించడం ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా ? ఎక్కడా జరగలేదని.. పైగా 'వైసీపీ ప్రభుత్వ తీవ్రవాదమని' పారిశ్రామికవేత్తలు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని బాబు చెప్పుకొచ్చాడు. అదేవిధంగా కియా కారు విడుదల కార్యక్రమంలో వైసీపీ ఎంపీ బెదిరింపుల ఫలితంగా 17అనుబంధ పరిశ్రమలు తరలిపోయ్యాయట. టాక్స్ కట్టలేదని సోలార్ ప్యానెళ్లు పగులగొట్టి, నిర్వాహకులను తుపాకీతో బెదిరించిన ఘటన వైసీపీ వచ్చాకే జరిగిందట. ఇలాంటి పదునైన ఆరోపణలు అయితే బాబు చేస్తున్నాడు గాని.. మరి బాబుకి ఇవ్వన్నీ ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి.
అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి అలుపెరుగని సేవలు చేసిన కార్యకర్తలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అయినప్పటికీ మళ్లీ బాబు సీఎం అవ్వటానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని చేసిన తప్పులను సవరించుకుని పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తే.. ఖచ్చితంగా బాబు పై వ్యతిరేకత తగ్గుతుంది. పైగా ప్రత్యర్ధి పార్టీ బలహీనతల పై పాలనలో జరుగుతున్న లోపల పై బాబుకి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ విషయాలన్నిటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సరిపుచ్చకుండా.. ప్రజల్లోకి పూర్తిగా వెళ్లేలా చొరవ తీసుకోవాలి. తమ బలాలను తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా చెప్పి.. అవసరం మేరకు వారి చేత పార్టీ సిద్దాంతాలను అమలు చేసే విధంగా ముందుకు సాగాలి. అలాగే నాయకత్వ లోపం లేకుండా.. ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే ఒక నాయకుడ్ని పెట్టాలి. ఇలా వచ్చే ఎన్నికల నాటికీ ఇలా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తే.. బాబు మళ్ళీ సీఎం అవ్వొచ్చు. అలా అవ్వాలంటే బాబు ముందు తన పబ్లిసిటీ మీద కాకుండా.. ప్రజా సమస్యల పైన పోరాటం చేయగలగాలి. అలా చేయాలని తెలుగు తమ్ముళ్లు బలంగా కోరుకుంటున్నారు.