దేశంలో రోజు రోజుకీ మానవత్వం పూర్తిగా నశించి పోతుంది. నవమాసాలు కడుపులో మోసిన తల్లి బిడ్డ పుట్టగానే బరువుగా మారుతుంది..దాంతో పుట్టిన పసికందులను చెత్త కుప్పల్లో, మురికి కాల్వల్లో పడేస్తున్నారు.  క్షణిక సుఖానికి లోనై ఓ బిడ్డకు ప్రాణం పోసి కళ్లు తెరవకముందే ప్రాణాలు తీస్తున్న కొంత మంది తల్లులు ఈ మద్య సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. 

తాజాగా బంజారాహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 13న ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారిని పీక్కు తిన్న కుక్కలు.అయితే ఆ చిన్నారి ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు..గాయపడ్డ ఆ శిశువును ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

అయితే ఒకవేళ ఆ శిశువును ఎక్కడ నుంచైనా తీసుకు వచ్చి ఆ కుక్కలు పీక్కు తిన్నాయా అన్న అనుమాణాలు కూడా కలుగుతున్నాయి. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: