శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలోని  శ్రీవారి ఆలయం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి తలపై స్వామివారి శేషవస్త్రంతో పరివట్టం కట్టుకుని మేళతాళాల మధ్య శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తారు. ఆలయ మహాద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశించి, గర్భాలయంలో మూలవిరాట్‌ ముందు అర్చకులకి, అధికారులకు పట్టువస్త్రాలు అందిస్తారు. దీనితో ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఘనత వైయస్‌ కుటుంబానిదే. ముఖ్యమంత్రి హోదాలో వైయస్‌ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.



తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వైయస్‌ కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవంగా పేర్కొనవచ్చు. ఈ ఏడాది అదే ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన తనయుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల వెంకటేశుని ఆశీస్సులతో వైయస్‌ కుటుంబానికే ఈ గౌరవం దక్కింది. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఘనత వైయస్‌ కుటుంబానిదే. టీటీడీ చరిత్రలో తండ్రి, తనయులు ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇంతకు ముందెప్పుడు జరగలేదు.




ముఖ్యమంత్రి హోదాలో వైయస్‌ రాజశేఖర రెడ్డి అనేక పర్యాయాలు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీవారిపై వైయస్‌ఆర్‌ కుటుంబానికి అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. తండ్రికి తగ్గ తనయుడిలా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా శ్రీవారి ఆశీస్సులు తీసుకుంటారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు, దిగ్విజయంగా పాదయాత్ర పూర్తయిన తర్వాత వైయస్‌ జగన్‌ వెంకన్నను కాలినడకన దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: