తెలంగాణలో ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర సంచలనం రేపుతుంది. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధం కావడంతో… ప్రభుత్వం ఆల్టర్ నేట్ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. గత మూడు రోజులుగా ఆర్టీసీ జేఏసీతో చర్చించామని… కొద్దిగా టైమ్ ఇవ్వండని అడిగినా కూడా వాళ్లనుంచి సరైన స్పందన రాలేదని IAS అధికారుల కమిటీ చైర్మన్ సోమేశ్ కుమార్ చెప్పారు.

ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. తెలంగాణలో దసరా పండగ పెద్ద పండగ కాబట్టి.. సమ్మెను నివారించేందుకు మూడు దఫాలుగా చర్చలు జరిపామని చెప్పారు. ఆర్టీసీ సమస్యలపై త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్నారు సోమేశ్ కుమార్. కార్మికుల సమ్మె రూల్స్ కి విరుద్దంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది IAS ల త్రిసభ్య కమిటీ.  అవసరమైతే డిస్మిస్ చేసే ఆలోచనలో కూడా ఉంది. 

అసలే ఇప్పుడు పండుగల సీజన్..ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అని అన్నారు.  సమ్మె చేస్తే ప్రత్యామ్నాయాలతో రెడీగా ఉన్నాం 2100 అద్దె బస్సులు అందుబాటులో ఉంచుతాం. 20వేలకు పైగా స్కూల్ బస్సులు ఉన్నాయి. అవసరమైతే వాటినీ నడుపుతాం. పోలీస్ ప్రొటెక్షన్ తో బస్సులు నడిపించడానికి రెడీగా ఉన్నాం. 3వేల మంది డ్రైవర్స్ ను  నియమిస్తాం.

ట్రాన్స్ పోర్ట్, ఆర్టీసీ అధికారుల కోఆర్డినేషన్ తో బస్సులు నడుపుతాం. ప్రజలకు ఇబ్బంది కలుగవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు IAS సునీల్ శర్మ. అయితే తెలంగాణ వచ్చాక రూ.3వేల 303 కోట్లు ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బడ్జెట్ లో కేటాయించిన దానికంటే ఆర్టీసీకి ఎక్కువే ఇచ్చామని అన్నారు కమిటీ సభ్యుడు, ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.1,695 కోట్ల సహకారం అందించారని గుర్తుచేశారు.ఇలాంటి సమ్మె వల్ల ప్రజల్లో సంస్థపై నమ్మకం పోతుందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: