ఇక ఏపీలో నెలకొన్న విద్యుత్  కొరత సమస్య చాలా విమర్శలకు దారి తీస్తుంది. ఇక ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ షాక్ కొడుతోంది. కరెంటు కోతలపై పలు  విపక్షాలు కూడా భారీగా విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ అసమర్థతతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని విమర్శి వినిపిస్తుంది. అదే స్థాయిలో అధికార వైఎస్సార్సీపీ పార్టీ అధికారులు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు వల్లే విద్యుత్ కొరత ఏర్పడిందని, వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని  విమర్శ వినిపిసితుంది.

ఇదే విషయమై ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేస్తూ  చాలా విమర్శలు గుప్పించారు. ఆయన పాద మహిమ వల్లే జలవిద్యుత్ కేంద్రాలు పడకేశాయని, ప్రస్తుతం మంచి రోజులు నడుస్తున్నాయని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా భారీ కౌంటరిచ్చారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత కొవ్వొత్తులు, ఇన్వర్టర్లు, లాంతర్లు, జనరేటర్ల వ్యాపారం  బాగా జరుగుతుంది అంటూ  విమర్శలు చేశారు. లాంతర్ల బిజినెస్ మొదలెట్టేశావా మామా.. సొల్లు మాటలు చెప్పకుండా కరెంటు ఎప్పుడొస్తుందో చెప్పు అంటూ విజయసాయి రెడ్డిపై ఆరోపణలు చేశారు.

ఇక ఇటీవల జరిగిన గ్రామ వాలంటీర్, సచివాలయ ఉద్యగాలపైనా విమర్శలు తెగపైకి లేపారు. సచివాలయ ఉద్యోగాల పరీక్షప్రశ్నాపత్రం లీకై మోసపోయిన నిరుద్యోగులు తన్నడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా   హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గ్రామ వాలంటీర్ అని పేరు పెట్టినంత మాత్రాన పెద్ద సేవకులు అయిపోరు అన్ని అంటున్నారు. రాష్ట్రంలో డెంగ్యూతో గ్రామ వాలంటీర్లు చనిపోతున్నారని, ముందు వారిని కాపాడుకోండి అన్ని అంటున్నారు. ఆ తరువాత వారు చేసే ఘనకార్యాల గురించి మాట్లాడుకుందామంటూ సెటైర్లు వేశారు.

ఇక మీకీ  దమ్ముంటే ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని, మద్యపాన నిషేధం అని చెప్పి ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు తెరిచినందుకు చెప్పుతో కొట్టడానికి మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: