ప్రతివారం జనం ముందుకు వస్తా ఒక్కొక్కడి బాగోతాలు బయటపెడతా అంటూ హీరో శివాజీ..  దేశద్రోహం పేరిట ప్రొమోను రిలీజ్ చేశారు. ఓఎన్జీసీకి చెందిన కొంత మంది గడ్డితినే వ్యక్తుల కారణంగా 27 రిగ్గుల కాంట్రాక్టును చేజిక్కించుకొని ప్రజాధనాన్ని లూటీ చేయడానికి మరో కొత్త అవతారంతో వస్తోన్న దేశ ద్రోహం గురించి మీకు చెప్పాలని వచ్చానని శివాజీ తెలిపారు.  ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో ప్రజాధనాన్ని ముఖ్యమంత్రులు, కాంట్రాక్టర్లు పంచుకోవాలని అనుకోవడం అసలు సిసలైన దేశద్రోహమన్నారు.


కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలతో బస్సులను కొనుగోలు చేసి.. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వాళ్ల జేబుల్లో నింపుకోవడం నిఖార్సైన దేశ ద్రోహం కాదా? అని శివాజీ ప్రశ్నించారు. ఓ చైనా పీస్ లాంటి మెఘా ఇంజినీరింగ్ సంస్థ నడిపే కృష్ణారెడ్డి ఈ దేశ ద్రోహం చేస్తున్నాడు. గత ఏడేళ్లలో ఆయన సంస్థ ఆదాయం రూ.26 వేల కోట్లకు చేరింది. ఈ  కా మీకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో.. ఇక నుంచి ప్రతి వారం మీ ముందు ఉంచుతాను. ఈ దేశానికి అతడు చేస్తున్న నష్టం, బీజేపీకి తెస్తున్న చెడ్డపేరు, పోలవరం రివర్స్ టెండరింగ్, ఓఎన్జీసీ కాంట్రాక్టులు తదితర అంశాలను బయటపెడతాను.


ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్టు లాంటి నీచమైన కాంట్రాక్టు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇటలీలో ఈ బాగోతం మొదలైంది. ముందుగా దాని గురించే మాట్లాడుతాను. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన సంస్థ ఈయనది కాదు.. గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తికి చెందినది. ఈ రెండు సంస్థల బాగోతాలను బయటపెడతాను.బంగారు తెలంగాణలో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టులో మెఘా కృష్ణారెడ్డి చేతివాటం రూ.35 వేల కోట్లు. సాక్ష్యాధారాలతో సహా మీ ముందు ఉంచుతా. నాకు ప్రాణహాని ఉంది.


నాలుగు నెలల క్రితమే ప్రధానికి, హోం మంత్రికి రాష్ట్రపతికి మెయిల్ పెట్టాను.మమ్మల్ని నాలుగు నెలలుగా భయపెడుతున్నారు. పోలీసులు వెంటాడుతున్నారు..... ఎక్కడా తొణక్కుండా ధైర్యంగా ఎదుర్కోవాలని భావించాం. మా జీవితాలను అతలాకుతలం చేసిన దుర్మార్గుడి గురించి చెప్పకపోతే భావితరాలు క్షమించవు. ఇలాంటి నీచపు కాంట్రాక్టర్ల వల్లే దేశం భవిత గంగపాలు అవుతుంది. నాయకుల్లో ఎంతో కొంత ఆలోచన తీసుకురావాలనే ఉద్దేశంతో ’మెఘా దోపిడీని ప్రతివారం జనం ముందుకు తీసుకొస్తాను అని శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: