మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ వరాల జల్లులు బాగా కురిపిస్తున్నారు. ఇక విష్యం ఏమిటంటే ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ యువతకు భారీ హామీలను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపింది.
మహారాష్ట్రలోని సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పాలక వర్గం. ఇంకా ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు అనేకమైన భారీ పధకాలను ప్రకటిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉన్నత
విద్య చదివే యువతకు, ఇతర దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి స్కాలర్షిప్లు ఇస్తామని ప్రకటించింది.
ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వికలాంగ యువత ఉన్నత విద్యకు అయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని తెలిపింది కాంగ్రెస్. ‘మేలుకో మహారాష్ట్ర రేపటి కోసం ఇప్పుడే పనిచేయి’ అన్న ప్లాట్ఫాం కింద మూడు కోట్ల మంది యువత పాల్గొన్నారని, వారి ఆలోచన ప్రతిబింబమే తాము ప్రకటించిన యూత్ కాంగ్రెస్ మేనిఫెస్టో అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యజీత్ తంబే తెలిపారు.
రాష్ట్రంలో యువతాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద యువతకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియచేశారు. కఠినమైన డ్రగ్ చట్టాలు, విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం వంటివి కల్పిస్తామని హామీలు ఇచ్చారు. లైఫ్స్టైల్ మేనేజ్మెంట్, సివిక్స్ వంటి సబ్జెక్టులను విద్యలో భాగం చేస్తామన్నారు. ఇన్ని హామీలను గుప్పించిన కాంగ్రెస్ యువతను తమ వైపు ఆకర్షించ గలదో లేదో ఎన్నికల ఐపోయాక ఫలితాలవరకు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చూడాలి ఇలాంటివి ఎన్ని హామీలను ప్రకటించిన బీజేపీ, శివసేన మిత్రపక్షాలను ఎంత వరకు ఎదురుకొని నిలవడగలదో. ఎందుకంటే మిత్రపక్షాల గాలి మహారాష్ట్రలో గట్టిగా వీస్తున్నాయని ఎన్నికల సర్వేలలో తెలుస్తోంది.