ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా రైతు సంక్షేమమే ముఖ్యమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే రైతు భరోసా  పథకాన్ని ఈ నెల 15న ప్రారంభిస్తున్నాం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. అక్టోబర్ 10న అన్ని గ్రామ సచివాలయ కేంద్రాల వద్ద రైతు భరోసా  అర్హులు, అనర్హుల పట్టికను ప్రదర్శించడంనున్నట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. ఆ తప్పిదాలను సరిచేయడానికి అర్హులైన రైతులు సహకరించాలని మంత్రి కన్నబాబు కోరారు. 


రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా అమలు దిశగా ప్రభుత్వ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకానికి అర్హులైన రైతులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 40 లక్షల మందిని ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్ 15 నుంచి రైతులకు పన్నెండు వేల ఐదు వందలు చొప్పున పెట్టుబడి సాయం పంటల బీమా ప్రీమియం చెల్లింపు, వడ్డీ  లేని రుణాలు ఇచ్చే ఏర్పాటు. కౌలు రైతులకు సాయం,11 నెలల కాలానికి ప్రత్యేక కార్డు..భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వైయస్సార్ రైతు భరోసా పెట్టుబడి సహాయ కార్యక్రమం వర్తిస్తుందన్నారు..ఉద్యాన పంటలు కనీసం ఎకరం భూమి సాగులో ఉండాలని నిబంధనను విధించారు.



అదే విధంగా రైతు భరోసా పొందాలంటే..కూరగాయలు, పువ్వులు, పశువుల మేత కోసం కనీసం అర ఎకరం భూమి సాగు చేస్తుండాలి. ఒకే యజమానికి ఒకరికి మించి కౌలుదారులుంటే ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. ఒకరికి మించి కౌలుదారులుంటే ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆ తర్వాతి వరుస క్రమంలో ఎస్సీ, బీసీ, మైనార్టీ రైతులకు వర్తింపచేయనున్నారు. వ్యవస్థీకృత భూ యజమానులకు పథకం వర్తించదన్న ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా  మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా  పథకం వర్తించదంట.



జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు వర్తించని ఈ  పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయం బట్టి పథకం వర్తింపచేయనున్నారు. భూమి కలిగి ఉన్న లక్షా 7 వేల మంది రైతులు తమ వారసులను లబ్ధిదారులను గుర్తించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు నేరుగా సాయం అందేవిధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా అనర్హులను పూర్తి సమాచారం ద్వారా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకూ రైతు భరోసా పథకం వర్తింపచేయనున్నట్టు మంత్రి కన్నబాబు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: